Andhra Pradesh

News March 26, 2024

దర్శి: వీఆర్వో మృతి

image

దర్శి మండలం తూర్పువీరయ్యపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న దేసు జయప్రకాష్ (48) మంగళవారం మృతి చెందారు. గత పది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వీఆర్వో సంఘం నాయకులు, దర్శి మండలం వీఆర్వో ఉద్యోగులు సంతాపం తెలిపారు.

News March 26, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నరసాపురం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే ఎనిమిది రైళ్లు ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే – నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా తేదీలలో మచిలీపట్నం, నరసాపురం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి.

News March 26, 2024

శ్రీకాకుళం: RBKల ద్వారా ధాన్యాన్ని విక్రయించండి

image

ఖరిఫ్ 2023-24 సీజన్ ముగింపు దశ కారణంగా ఈ నెలాఖరులోగా రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన RBKల ద్వారా ప్రభుత్వానికి విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నవీన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాని రైతు భరోసా కేంద్రాల వద్ద మద్దతు ధరకు విక్రయించాలన్నారు. మార్చి 31 దాటితే రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరగదన్నారు.

News March 26, 2024

పదోతరగతి పరీక్షలకు 816 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవశాస్త్రం పరీక్షలకు మొత్తం 25,287 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. కాగా 816 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు ఎక్కడ అందలేదన్నారు. జిల్లా మొత్తం జీవశాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. జిల్లా మొత్తం హాజరు 96.87 శాతం నమోదు అయ్యిందన్నారు.

News March 26, 2024

రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా నాంబత్తుల రాజు

image

రాజమండ్రి రూరల్ జై భీమ్‌రావ్ భారత్ పార్టీ MLA అభ్యర్థిగా నాంబత్తుల రాజుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ నియమించినట్లు తెలిపారు. సామాన్యుడికి MLA టికెట్ రావడం పట్ల పలువురు సామాజిక వ్యక్తులు, ఉద్యమ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచి తీరతానని అన్నారు.

News March 26, 2024

ప.గో.: దివ్యాంగురాలిని నమ్మించి గర్భవతిని చేసి

image

ప.గో. జిల్లా పాలకోడేరు మండలకేంద్రానికి చెందిన పి.దుర్గా సూర్యనారాయణ రాజు అదే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలిని (యువతి) నమ్మించి గర్భవతిని చేశాడు.  పెళ్లి చేసుకోమని అతడిని కోరగా అతను నిరాకరించినట్లు దివ్యాంగురాలి తల్లి పార్వతి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా..సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. 

News March 26, 2024

తెర్లాం: గుండెపోటుతో డిజిటల్ అసిస్టెంట్ మృతి

image

తెర్లాం మండలం సుందరాడ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న ఉప్పాడ శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం భోజనం కోసం తన సొంత ఊరు ఉద్దవోలు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. వెంటనే దగ్గరలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 26, 2024

అనకాపల్లి: రైలు నుంచి జారిపడిన యువకుడు మృతి

image

రైలు నుంచి జారి పడి అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని యువకుడు(25) మంగళవారం మృతి చెందాడు. శారదానది బ్రిడ్జ్‌ సమీపంలో సోమవారం రాత్రి సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైల్వే ట్రాక్‌ సమీపంలో రైలు నుంచి యువకుడు జారి పడిపోయాడు. అటుగా వెళ్లే రైల్వే గ్యాంగ్‌మాన్‌ సమాచారంతో 108 అంబులెన్సులో ఆస్పత్రికి తర లించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.

News March 26, 2024

రాజంపేట: వైసీపీలో చేరిన గంటా నరహరి

image

విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు. ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

News March 26, 2024

ఉగాది మహోత్సవాల్లో భక్తులకు మల్లన్న అలంకార దర్శనమే: ఈవో

image

శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మహోత్సవాల్లో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛంద సేవాసంస్థల భక్త బృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. అలంకార దర్శన విషయమై భక్త బృందాలు అవగాహన కల్పించాలన్నారు.