India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం రైతు బజారు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ బాధితులను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థ తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని ఖాతాదారులను నమ్మించింది. జిల్లాలో సుమారు 3 వేల మంది సభ్యులుగా చేర్చుకుంది. పలు మార్గాల రూపంలో డబ్బులు వసూలు చేసి, 4 నెలలుగా అనుమానం కలగకుండా సక్రమంగా చెల్లింపులు జరిపింది. సంస్థ కార్యకలాపాలు అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
ఉమ్మడి జిల్లాలోని ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.
సంగం మండలం పడమటి పాలెంలో మంగళవారం అప్పుల బాధ తట్టుకోలేక ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కానిస్టేబుల్ రమేశ్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రామకృష్ణపై రహస్యంగా, సమగ్ర విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.
అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్, టీజీ భరత్, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, MLAల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
ఏలూరుకు చెందిన లాయర్ కార్తీక్ గత నెల మృతి చెందిన విషయం తెలిసిందే. ఏలూరు 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. కార్తీక్ HYDలో వేరే కులానికి చెందిన మనీషాను 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య తరఫువాళ్లు కుల వివక్ష చూపేవారు. 2023లో భార్య పుట్టింటికి వెళ్లిపోయి, తన వారితో కేసులు పెట్టించడంతో మనోవేదనకు గురై మృతి చెందారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో అతని భార్య, మరో ఐదుగురిపై కేసు నమోదైనట్లు తెలిపారు.
భవానీపురం సబ్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీ.వీ సుధాకర్ తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు టీచర్స్ కాలనీ, అప్నా బజార్ రోడ్డు, ఇందిరా ప్రియదర్శినీ కాలనీ, దర్గాప్లాట్లు, హెచ్బీ కాలనీలోని 450 ఎస్ఎఫ్ఎ బ్లాక్ వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
కాకినాడ జీజీహెచ్లో తొండంగి మండలానికి చెందిన అనంతలక్ష్మి (55)కి మంగళవారం అదుర్స్ సినిమా చూపిస్తూ మొదటి సారిగా అరుదైన ఆపరేషన్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. మత్తు ఎక్కువ ఇవ్వకుండా సినిమా చూపిస్తూ మెదడులో కణతి తొలగించామన్నారు. ఆమె 15 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర విభాగానికి రాగా.. మెదడులో కణతి ఉందని గుర్తించారు. అవేక్ క్రేనియటోమీ అనే అధునాతన పద్ధతిలో ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఎన్టీఆర్ స్టేడియంలలో జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ నాగలక్ష్మి , గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నసీర్, గళ్ళా మాధవి, నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.