Andhra Pradesh

News September 18, 2024

ఒంగోలు: నిరుద్యోగ మహిళలకు GOOD NEWS

image

ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 01 వరకు, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు చెందిన 19- 45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ మహిళలు అర్హులని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 4/11, భాగ్య నగర్, దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒంగోలులో సంప్రదించాలన్నారు.

News September 18, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షల విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10ల‌క్ష‌ల విరాళాన్ని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత అందజేశారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌తో కలిసి చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

News September 18, 2024

ధర్మవరం సుబ్బారెడ్డికి కీలక పదవి దక్కనుందా?

image

నామినేటెడ్ పదవుల కోసం జిల్లా TDP నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలు ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో డోన్ TDP ఇన్‌ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డికి కీలక పోస్ట్ వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయనను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News September 18, 2024

నరసన్నపేట: వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

image

నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవానిపేటకు చెందిన శిమ్మ దివ్య అత్తింటి వేధింపులు కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన నరసన్నపేటలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. దివ్య తల్లి ఆదిలక్ష్మి నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు.

News September 18, 2024

ఏపీలో మొదటి స్థానంలో విశాఖ రైల్వే స్టేషన్

image

ఆదాయ ఆర్జనలో విశాఖ రైల్వే స్టేషన్ ఏపీలో మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రాకపోకల ద్వారా రూ.564 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏపీలో టాప్ 30 రైల్వేస్టేషన్లలో కూడా విశాఖ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తిరుపతి విజయవాడ స్టేషన్‌లతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల విషయంలో వెనుకంజలో ఉంది.

News September 18, 2024

పోషకాహార లోపంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలెవరూ పోషకాహార లోపంతో బాధపడకూడదని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవనంలో ఐసీడీఎస్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి, వయస్సుకు తగినట్టుగా ఎత్తు, బరువు ఉండేలా తగిన ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం కచ్చితంగా అందేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

News September 18, 2024

బెంగళూరు-ధర్మవరం ప్యాసింజర్ రైలు అనంతపురం వరకు పొడిగింపు

image

బెంగళూరు నుంచి ధర్మవరం వరకు నడుస్తున్న 06515/06516 ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారి బీఎస్ క్రిస్టోఫర్ ఆదేశాలు జారీచేశారు. సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం మీదుగా అనంతపురం వెళ్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వినతి మేరకు పొడిగించినట్లు తెలిపారు.

News September 18, 2024

VZM: భర్త ఏడేళ్ల జైలు శిక్ష.. భార్యకు జరిమానా

image

డెంకాడ పోలీసు స్టేషనులో 2020లో నమోదైన హత్య కేసులో చింతలవలస గ్రామానికి చెందిన మోపాడ అప్పల నాయుడుకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, అతడి భార్య శాంతికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం మహిళా కోర్టు తీర్పు వెల్లడించినట్లు భోగాపురం సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఇంటి స్థలం విషయమై 2020లో జరిగిన ఘర్షణలో అదే గ్రామానికి చెందిన పోలిపల్లి ఉమా అనే మహిళ మృతికి నిందితులు కారణమయ్యారు.

News September 18, 2024

ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

కడప జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ యోజన, సాలిడ్ వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, స్వచ్ఛతా హీ సేవ, హౌసింగ్, నూతన ఇసుక పాలసీ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు

News September 18, 2024

శ్రీకాకుళం: వంద రోజుల కార్యాచరణ లక్ష్యాలపై సమీక్ష

image

అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కీలక శాఖల 100 రోజుల కార్యాచరణ నివేదికలపై శాఖల వారీగా ఉన్నతాధికారులతో శ్రీకాకుళంలో బుధవారం దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతి, లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్‌తో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. అందరూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.