Andhra Pradesh

News March 22, 2024

గోనెగండ్లలో విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

గోనెగండ్లలోని లక్ష్మీపేటలో జరిగే ఒక పెళ్లికి ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి చెందిన ఎల్లారెడ్డి కుటుంబంతో పాటు వారి కుమారుడు అరుణ్ కుమార్(6) వచ్చాడు. పెళ్లి సందడిలో ఉండగా అరుణ్ కుమార్ కొంతమంది పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News March 22, 2024

ప్రకాశం: మాజీ మంత్రి శిద్దా సోదరుడు మృతి

image

రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు వెంకట కృష్ణారావు మృతి చెందాడు. చీమకుర్తి మండలంలోని రామతీర్థం పుణ్య క్షేత్రంలోని ఆర్యవైశ్య సత్రం వద్ద ఉన్న బావిలో వెంకట కృష్ణారావు మృతదేహం లభ్యమైంది. అతనిది ఆత్మహత్యా, బావిలో కాలు జారిపడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని సొంత గ్రామమైన చీమకుర్తికి తీసుకువచ్చారు.

News March 22, 2024

విజయనగరం: ఐదుగురు వాలంటీర్లు తొల‌గింపు

image

ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించి, రాజ‌కీయ పార్టీల కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఐదుగురు వాలంటీర్ల‌పై వేటు ప‌డింది. రాజ‌కీయ పార్టీ స‌మావేశంలో పాల్గొన్న‌ గ‌రివిడి మండ‌లం చుక్క‌వ‌ల‌స‌కు చెందిన
వాలంటీరు ద‌బ్బాక వెంక‌ట‌ల‌క్ష్మిని తొలగించారు. పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ విజయనగరంలో అద్దేప‌ల్లివారి వీధికి చెందిన గుర‌జాపు చంద్ర‌శేఖ‌ర్‌, గంగి ముర‌ళి, కుప్ప గురుమూర్తి, బ‌స‌వ రాజుపై కూడా వేటుపడింది.

News March 22, 2024

తాడిపత్రిలో యువతిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

తాడిపత్రిలోని 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ప్రేమించి మోసం చేశాడని ఆరోపించిన అనూషపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు. కౌన్సిలర్ మల్లికార్జున తల్లి సావిత్రి, చెల్లెలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపి అనూషపై 18న సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News March 22, 2024

విజయవాడలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

image

విజయవాడలో శుక్రవారం భారీగా నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద రెండు కేజీల బంగారం, కిలోన్నర వెండి, కోటిన్నర నగదు పట్టుబడింది.ఎన్నికల నిబంధన మేరకు ఒక మనిషి రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఇది నగరంలోని ఓ బంగారు షాపుకు చెందినదిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు.

News March 22, 2024

శ్రీ సత్యసాయి: బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. యువకుడి మృతి

image

కదిరి మండలం కాళసముద్రంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు అనంతపురం డిపోకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2024

శ్రీకాకుళం: పది పరీక్షలకు 1036 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మొత్తం 29,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,358 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 1036 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

News March 22, 2024

ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నా: రాయపాటి

image

ఎంపీలు సీబీఐ కేసులకు భయపడి ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో పోరాటం చేయలేకపోతున్నారని విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీశ్ మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు, ఏపీకి రావాల్సిన హక్కుల కోసం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రాయపాటి జగదీశ్ స్పష్టం చేశారు.

News March 22, 2024

తాగునీరు, ఉపాధి హామీ పనులపై సీఎస్ సమీక్ష

image

కరువు మండలాల్లో తాగునీరు, ఉపాధి హామీ పనుల కల్పనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సత్యసాయి జిల్లా అధికారులతో మాట్లాడుతూ నీటి ఎద్దడి కల ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు పలువులు పాల్గొన్నారు.

News March 22, 2024

చిత్తూరు: ఆ 4 చోట్ల మహిళలు గెలవలేదు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.