Andhra Pradesh

News March 21, 2024

కర్నూలు: వరుసగా 5సార్లు MLA.. 3సార్లు ఓటమి

image

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ మోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. నియోజకర్గంలో 8సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అందులో 1983 నుంచి 1999 వరకు వరుసగా 5సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2012 వరకు వరుసగా చెన్నకేశ్వరెడ్డి చేతిలో 3సార్లు ఓటమిపాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర గౌడ్‌పై 28904 అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది.

News March 21, 2024

రాయదుర్గం: ఇరువర్గాల ఘర్షణ..13 మందిపై కేసు 

image

రాయదుర్గం రూరల్‌ మండల పరిధిలోని కొంతానపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ఇరు వర్గాల ఘర్షణలో 13మందిపై కేసు నమోదుచేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. పొలం విషయంలో కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి  దాడులు చేసుకున్నారన్నారు. ఇరు వర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. పరస్పర ఫిర్యాదుల మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 21, 2024

ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం: కలెక్టర్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకునేందుకు  జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ 0863-2234301 నంబరుకు ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని పేర్కొన్నారు. 

News March 21, 2024

ప్రకాశం: అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు

image

జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికను అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అతడికి 10 జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనానికి చెందిన మిడసాల శివకృష్ణ(32) 2014లో హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 13 ఏళ్ల బాలికను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా పదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 21, 2024

పిడుగురాళ్ల: రైలు కింద పడి మహిళ మృతి

image

రైలు కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండల పరిధిలోని జానపాడు రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం మాచర్ల ప్యాసింజర్ రైలు వస్తున్న సమయంలో గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 21, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 25, 26 తేదీల్లో సత్రాగచ్చి(SRC), మహబూబ్‌నగర్(MBNR) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25న నెం.08845 SRC- MBNR, ఈ నెల 26న నెం.08846 MBNR- SRC మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లిలో ఆగుతాయన్నారు.

News March 21, 2024

ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

image

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి <<12893521>>వరదరాజుల రెడ్డి<<>>పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే మంగళవారం 38వ వార్డులో, 22వ వార్డులో వరదరాజుల రెడ్డి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేశారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 21, 2024

పాతపట్నం నుంచి ఈ సారి గెలిచేదెవరు?

image

పాతపట్నం నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కలమట వెంకటరమణమూర్తి, రెడ్డిశాంతి వరసగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ వెంకటరమణ 2019 టీటీపీ నుంచి వైసీపీ అభ్యర్థి రెడ్డిశాంతిపై పోటీచేసి ఓడిపోయారు. కలమట వెంకటరమణ తండ్రి కలమట మోహనరావు టీడీపీ నుంచి నాలుగుసార్లు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి గెలిచారు. వైసీపీ నుంచి రెడ్డిశాంతికి టికెట్ కన్ఫామ్ అయ్యింది. పాతపట్నంలో ఈ సారి గెలిచేదెవరు.

News March 21, 2024

తాళ్లరేవు:ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో

image

216వ నంబర్‌ జాతీయ రహదారిపై తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్టు కోరంగి పోలీసులు తెలిపారు. యానాం నుంచి కాకినాడ వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు కాకినాడ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.

News March 21, 2024

కర్నూలు : పది పరీక్షకు 589 మంది గైర్హాజరు

image

జిల్లాలో జరగుతున్న పదో తరగతి పరీక్షల్లో 588 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో శ్యాముల్ బుధవారం తెలిపారు. ఆంగ్ల పరీక్షకు మొత్తం 31,465 మందికి గాను 30,878 మంది విద్యార్థులు పరీక్ష రాసారని తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదన్నారు. అలాగే సార్వత్రిక విద్యలో పదో తరగతి పరీక్షకు 964 మందికి గాను 891 మంది పరీక్ష రాసినట్లు 73 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.