Andhra Pradesh

News March 21, 2024

స్ట్రాంగ్ రూములు పటిష్టంగా ఏర్పాటు చేయండి :కలెక్టర్

image

ఎన్నికల కోసం రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములను పటిష్టంగా ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్ల ఏర్పాటును పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలో 8 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.

News March 21, 2024

ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి: కృష్ణా కలెక్టర్

image

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీ ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు
పెయిడ్ న్యూస్‌ను పర్యవేక్షిస్తుందన్నారు.

News March 21, 2024

దాడులు, భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు: ఎస్పీ తుషార్

image

ఎన్నికల సమయంలో ఎవరైనా దాడులకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ బుధవారం తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినట్టు సమాచారం ఉంటే ప్రత్యక్షంగా చర్యలు పాల్పడొద్దన్నారు. సిటిజన్ యాప్ లేదా టోల్ ఫ్రీ నెంబర్లు లేదా దగ్గర్లోని పోలీసులు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేకానీ ఎవరికి వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

News March 21, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లు త్వరగా చేపట్టాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని శ్రీకాకుళం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని నమూన్ ఆదేశించారు. బుధవారం ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట పట్టణాల్లో సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

News March 20, 2024

తణుకులో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సందడి

image

ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ బుధవారం తణుకులో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తణుకు పట్టణానికి విచ్చేసిన ఆమె.. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. వెంకటరామయ్య థియేటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి రష్మి గౌతమ్ విచ్చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.

News March 20, 2024

జిల్లాలో సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయండి: ఎస్పీ

image

జిల్లాలో ఎన్నికల వేళ ఎక్కడైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు ఆగడాలు, దౌర్జన్యాలు చేస్తున్నా, పాత పంథా కొనసాగిస్తున్నా, ఏదైనా హింస, అల్లర్లు, గొడవలకు పాల్పడుతున్నా వెంటనే తమకు ఈ నంబర్ ద్వారా  9440796800 సమాచారం పంపాలన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కోరారు.

News March 20, 2024

ప్రకాశం: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటించాలి

image

ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించడంతోపాటు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఎన్నికల అధికారులకు సూచించారు. కొండపి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎన్నికల కమిషన్ నిబంధనలపై మండల స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అలాగే రిటర్నింగ్ అధికారులందరూ తమ బృందాల్లోని అధికారులను సిద్ధం చేయాలని తెలిపారు.

News March 20, 2024

ఏలూరులో విషాదం.. పిడుగు పడి వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లాలో బుధవారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చోదిమెళ్ల శివారులో పిడుగు పడగా.. పొలం పనులు చేస్తున్న సుబ్బారావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు బోరున విలపించారు.

News March 20, 2024

లారీ-గోడకు మధ్య ఇరుక్కొని మహిళల మృతి

image

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం లలిత రైస్ ఇండస్ట్రీలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ వెనక్కి తీస్తుండగా క్యాబిన్‌కు-గోడకు మధ్య చిక్కుకొని కామేశ్వరి(60), నాగరత్నం(65) మృత్యువాత పడ్డారు. వర్షం వస్తోందని గోడ పక్కన నిలుచున్న వీరిని లారీ ఢీ కొట్టింది. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2024

రాజంపేట: వృద్ధుడు కనిపించడం లేదని ఫిర్యాదు

image

చిట్వేల్ మండలం దొగ్గలపాడుకు చెందిన కొండ్రెడ్డి నర్సింహా రెడ్డి (56) కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందిందని రాజంపేట పట్టణ ఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తెల్ల రంగు పంచ, చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 91211 00570కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.