India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్ష 24,209 మందికి గానూ 23,452 మంది రాశారు. 757 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1342 మందికి 423 మంది హాజరయ్యారు. 919 మంది గైర్హాజరయ్యారు. అటు ప.గో జిల్లాలో 21,462 మందికి గానూ 20,455 మంది హాజరు కాగా.. 1007 మంది ఆబ్సెంట్ అయినట్లు పేర్కొన్నారు. వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 1493 మందికి గానూ 69 మంది ఆబ్సెంట్ అయ్యారు.
ఎన్నికల సంసిద్ధతపై సత్యసాయి కలెక్టర్ కార్యాలయ అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్ఓ కొండయ్య తదితరులతో ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రొద్దుటూరులో 27న సీఎం జగన్ నిర్వహించే బస్సు యాత్ర బహిరంగ సభకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో సభకు స్థలం అనువుగా ఉంటుందని వైసీపీ నాయకులతో ఆయన చర్చించారు. వైసీపీ ప్రోగ్రాం మెంబర్ చంద్రహాసరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, JCS జిల్లా కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ భవనాలు ప్రాంగణాల ఆవరణలో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు తీసుకున్నట్లు తెలిపారు.
కోనసీమ మహిళలు కొబ్బరి పీచుతో తయారు చేస్తున్న బొమ్మలను కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కాకినాడ లేపాక్షి మేనేజర్ వీరబాబు తెలిపారు. మంగళవారం ఆయన మామిడికుదురు మండలం పాసర్లపూడిలోని ఆక్సిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో నిర్వహిస్తున్న గ్రామ దుకాణ్ కొబ్బరి పీచు బొమ్మల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు.
భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్స్, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ వీడియో గ్రాఫర్లు ఎన్నికలకు సంబంధించిన ప్రతి చిన్న ఘటనను వీడియోగ్రఫీ చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో అన్ని టీమ్ల వీడియో గ్రాఫర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు.
ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. ఒంగోలులోని కలెక్టర్ పరిపాలనా భవనంలో ఎన్నికల సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పారు. అవసరమైన సామగ్రిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని చెప్పారు.
వంట గ్యాస్ సిలెండర్ల పంపిణీలో అదనంగా వసూలు చేసే గ్యాస్ కంపెనీ డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి హెచ్చరించారు. 15 కిలోమీటర్ల లోపు వరకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరాదన్నారు. కొంతమంది గ్యాస్ సిలెండర్ డెలివరీ బాయ్స్ పంపిణీకి అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వంట గ్యాస్ పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు పొరపాట్లకు తావు లేకుండా పూర్తి సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. ఆర్ఓలు, ఈఆర్ఓలు, నోడల్ అధికారులు, ఎన్నికల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. సీ- విజిల్, సువిధ, ఎంసీసీ తదితర అంశాలను గమనించాలన్నారు.
వినుకొండ మండలం పెద్ద కంచర్లలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పర్యటించారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి వచ్చిన వారిని వినుకొండ ప్రాంతం ఆదరించిందని అన్నారు. తనను ఎంపీగా గెలిపించి, ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడుని గెలిపిస్తే నియోజకవర్గాన్ని, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని భరోసాని ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.