Andhra Pradesh

News March 19, 2024

జొన్న సేకరణకు రిజిస్టేషన్ ప్రారంభం

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి జొన్న, మొక్కజొన్న సేకరణకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు జొన్న పంట ఒక క్వింటాకు రూ.3180, మొక్కజొన్న పంట క్వింటాకు రూ.2090 కనీస మద్దతు ధరగా ప్రకటించారు.

News March 19, 2024

గుడిపల్లి: ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు

image

గుడిపల్లి మండలం చీకటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకట్, కుప్పం మండలం టెక్నికల్ అసిస్టెంట్ మురుగేషన్ లను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News March 19, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవు: కలెక్టర్

image

రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వంలో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ హెచ్చరించారు. ప్రభుత్వంలో పనిచేసేవారు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటున్నారని వివిధ పత్రికలలో వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు.

News March 19, 2024

ఈనెల 30న హిందూపురం బస్సు యాత్రలో CM జగన్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి టి.ఎన్. దీపిక తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రకు జిల్లా వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News March 19, 2024

చిలకలూరిపేట: రాజేశ్ నాయుడికి CMO నుంచి పిలుపు

image

మొన్నటి వరకు చిలకలూరిపేట YCP ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజేశ్ నాయుడికి CMO నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల కావటి మనోహర్‌‌ను ఇక్కడి ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్ఠానం.. ఆయనకే MLA టికెట్ ఇచ్చింది. తనను తప్పించడంపై అసంతృప్తిగా ఉన్న రాజేశ్ సీఎం పిలుపు మేరకు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. దీంతో పాటు ఆయన ఇటీవల మంత్రి రజినీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో సీఎంవో నుంచి పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 19, 2024

తూ.గో.: అకాల వర్షాలు.. బీ అలర్ట్

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు రేపు (ఈ నెల 20న) కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోనసీమ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.

News March 19, 2024

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తున్నాయి. జిల్లాలోని పొందూరు, చిలకపాలెం, గంగువారి సిగడాం, ఆమదాలవలస పలు మండలాల్లో ఈదురు గాలులు ఉరుములతో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇన్ని రోజులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.

News March 19, 2024

కడప జిల్లాలో నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆవేదనతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 20న గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామంలో పర్యటించి తిరుమల వెళ్లనున్నారు. 21న రాత్రికి బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పొరుమామిళ్ల చేరుకుని మండలంలో 22న కార్యకర్తలను పరామర్శిస్తారు.

News March 19, 2024

సూళ్లూరుపేటలో టపాసుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

image

సూళ్లూరుపేట హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఉన్న టపాసుల గోడౌన్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులు తయారుచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగసి పడ్డాయి. ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ?

image

అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధ పోటీ చేస్తారన్న ప్రచారం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించగా, అక్కడ బొండా ఉమాకు అవకాశం దక్కింది. దీంతో జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి నాదెండ్ల మనోహర్‌ని రాధ కలవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.