Andhra Pradesh

News March 19, 2024

విజయనగరంలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది: సీఐ

image

విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

News March 19, 2024

కోనసీమ: ఉద్యోగం రావట్లేదని యువకుడు SUICIDE

image

కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన నల్లి శ్రీకాంత్ కుమార్ (23) బీటెక్ చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది ఆదివారం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతణ్ని రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ కుమార్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్ఐ తెలిపారు.

News March 19, 2024

అనంత: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

image

చెన్నై కొత్తపల్లి హైవేపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో ఓ వ్యక్తి మృతదేహాన్ని తాడిపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి చెన్నై కొత్తపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బస్సుని అంబులెన్స్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

News March 19, 2024

కర్నూలు: ఆసుపత్రి గదిలో రోజాంతా చిక్కుకు పోయిన ఐదేళ్ల బాలుడు

image

ఐదేళ్ల చిన్నారి రోజంతా గదిలో బందీ అయిన ఘటన కర్నూలు ఆసుపత్రిలో జరిగింది. ఓర్వకల్లు(M) తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కొడుకు సుజిత్‌ పుట్టుకతో మూగ, చెవుడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆదివారం తల్లి బయటకు వెళ్లగా బాలుడు ఎనస్థీషీయా HOD గదిలోకి వెళ్లాడు.గదిని శుభ్రంచేసి బాలుడిని గమనించకుండా తాళం వేశారు. వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. సోమవారం గది తలుపులు తెరవగా సుజిత్ అందులో ఉన్నారు.

News March 19, 2024

విశాఖలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది: సబ్బవరం సీఐ

image

విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సబ్బవరం సీఐ పిన్నింటి రమణ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ దౌర్జన్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పోతారన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

News March 19, 2024

గిద్దలూరు: గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

image

గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గిద్దలూరు మండలం పరమేశ్వర్ నగర్ గ్రామానికి చెందిన <<12881965>>TDP కార్యకర్త<<>> మునయ్యపై నలుగురు వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునయ్యను హైదరాబాద్ లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మునయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 19, 2024

సింహాచలం: చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు

image

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించే చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్సవానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ రోజున కేవలం విధుల్లో ఉన్న వైదికలు, ఆలయ సంప్రదాయం ప్రకారం అనుమతులు ఉండే వాళ్లకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పించాలని సూచించారు. ఆరోజున ఘాట్ రోడ్డులో కేవలం మినీ బస్సులు మాత్రమే నడపాలని అన్నారు.

News March 19, 2024

కృష్ణా: చేపల చెరువులో విషప్రయోగం

image

బంటుమిల్లి మండలం రామవరపు మోడిలోని 3 ఎకరాల చేపల చెరువులో విషప్రయోగం కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం.. గూడవల్లి లక్ష్మీ చేపల సాగు చేస్తున్నామన్నారు. కుమార్తె వివాహం కోసం నాలుగు రోజుల్లో చేపలు పట్టడానికి బేరం కుదుర్చుకున్నామని, ఈలోపే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో చేపలన్నీ చనిపోయాయని.. దాదాపు రూ. 7 లక్షల నష్టం జరిగిపట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఆత్మకూరు: మద్యం షాపులో రూ. 3.89 లక్షల చోరీ

image

ఆత్మకూరు పట్టణంలోని ఒక మద్యం దుకాణంలో నగదు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు ఒక వైపు గోడకు రంద్రం వేసి లోనికి ప్రవేశించి దుకాణంలోని రూ. 3.89 లక్షల నగదు చోరీ చేశారు. ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 19, 2024

నరసాపురం చరిత్రలో తొలిసారిగా..

image

1952లో ఏర్పడిన నరసాపురం పార్లమెంట్ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ అత్యధికంగా 15 సార్లు క్షత్రియ, 2 సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎంపీలుగా గెలుపొందారు. కాగా వైసీపీ తొలిసారిగా బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. శెట్టిబలిజ వర్గానికి చెందిన న్యాయవాది గూడూరి ఉమాబాలను అభ్యర్థిగా ప్రకటించింది.