Andhra Pradesh

News September 24, 2025

ANU PG ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన PG రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.SC ఎన్విరాన్మెంటల్ సైన్స్ 16/16 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారన్నారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 7లోపు ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.1860లు, జవాబు పత్రం నకలు కావాలనుకునేవారు రూ. 2190లు చెల్లించాలన్నారు.

News September 24, 2025

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట: కలెక్టర్

image

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GST 2.0 వ్యవసాయం, పారిశ్రామిక, భవన నిర్మాణం, విద్యారంగం, వర్తక రంగాలకు ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసరాలు, మెడిసిన్‌, వ్యసాయ పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఆటోమొబైల్‌ రంగాల్లోని ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గిందన్నారు.

News September 24, 2025

అక్టోబర్ 15న తూర్పు గోదావరి రెడ్‌క్రాస్ ఎన్నికలు

image

రాజమండ్రి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు అక్టోబరు 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఈ ఎన్నికలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం ఉన్న పేట్రన్, వైస్ పేట్రన్, లైఫ్ మెంబర్స్ ఈ ఎన్నికలకు హాజరు కావాలని సూచించారు.

News September 24, 2025

SKLM: మీ ప్రతిభతో ప్రధాని మోదీని కలవచ్చు

image

కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం మేర యువ భారత్ ఆధ్వర్యంలో ‘యువ నాయకులు (క్వీజ్) ప్రసంగ పోటీలు’ జరగనున్నాయి. వీటికి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులని మేర యువ భారత్ డిప్యూటీ డైరక్టర్ వెంకట్ ఉజ్వల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలవారు https://www.MYBharat.gov.in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 30లోగా నమోదు చేయాలన్నారు. ఎంపికైన వారు ప్రధాని మోదీ‌ని కలవచ్చునన్నారు.

News September 24, 2025

ప్రొద్దుటూరు: ప్రారంభమైన ఎగ్జిబిషన్

image

ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏడాది దసరా పండుగ సమయంలో ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.35, పిల్లలకు రూ.25గా పేర్కొన్నారు. ఇక పార్కింగ్ ఫీజు టూ వీలర్‌కు రూ.10, ఫోర్ వీలర్‌కు రూ.20లుగా నిర్ణయించారు.
NOTE: GST అదనం

News September 24, 2025

శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

image

దసరా పండుగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిధిలోని నాలుగు డిపోల నుంచి దూర ప్రాంతాలకు 480 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 29 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలు ఉంటాయన్నారు.

News September 24, 2025

ప్రకాశం జిల్లాలోని 8, 10 తరగతుల విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల 2026-27 అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శివరాం బుధవారం తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అక్టోబర్ 7వ తేదీలోగా దరఖాస్తులను ఆఫ్లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో ఇవ్వాలని సూచించారు.

News September 24, 2025

VZM: ‘రెవెన్యూ వినతులపై సానుకూలంగా వ్యవహరించాలి’

image

విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులు ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ వినతులకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. వినతుల పై ప్రజల సంతృప్తి పెరగాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవ్, DRO శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు.

News September 24, 2025

ప్రతి విద్యాసంస్థల్లో నో డ్రగ్స్: ఎస్పీ

image

జిల్లాలో ప్రతి విద్యాసంస్థల్లో నో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 250 పాఠశాలలో ఈగల్ టీములను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

News September 24, 2025

గుంటూరులో దొంగలు అరెస్ట్

image

పాతగుంటూరులో చోటుచేసుకున్న దొంగతనం ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు ఇంట్లోని బీరువా పగులగొట్టి రూ.2.40 లక్షలు దొంగలించిన కేసులో CI వెంకట ప్రసాద్, SI అబ్దుల్ రెహమాన్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో వారిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి రూ.2.10 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించారు.