India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని రైతులు స్వచ్చందగా తమ భూమిని పూలింగ్కి అందజేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి నారాయణకు ఏడు ఎకరాలు భూమికి సంబందించిన నలుగురు రైతులకు అంగీకారపత్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులు కోరుకున్న చోటే ప్లాట్స్ కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అలానే కౌలు ఒక ఇన్స్టాల్మెంట్ రైతులు ఖాతాలో వేయటం జరిగిందని త్వరలోనే 2వ ఇన్స్టల్మెంట్ వేస్తామన్నారు.
రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని, విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9:30 నుంచి రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుతామన్నారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు తెలిపారు. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. క్యూ లైన్లు, స్నానపు ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రాంతాలను పరిశీలించారు.
☞ జి.సిగడాం: సంచరిస్తున్న సింహంపై క్లారిటీ
☞ శ్రీకాకుళం: విజయవాడ బాధితులకు రూ.5 లక్షల సాయం
☞ ఇచ్చాపురం: జ్వరంతో 11 ఏళ్ల బాలుడి మృతి
☞ నందిగాం: నీట్ పీజీలో సాయి కిరణ్ ప్రతిభ
☞ శ్రీకాకుళం: రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
☞ నరసన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
☞ శ్రీకాకుళం: బదిలీపై జిల్లాకు ముగ్గురు డీఎస్పీలు
☞ కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం: ఎస్పీ మహేశ్వర రెడ్డి
అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో రోడ్లో నివాసం ఉండే అనిత అనే వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మైదుకూరు – పొద్దుటూరు ప్రధాన రహదారిలో డివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. పొద్దుటూరు నుంచి మైదుకూరుకి వస్తున్న రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ గుర్తించలేక స్కూటీ బోల్తా పడి మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోసిగి గ్రామానికి చెందిన బలకుందు కోసిగయ్య(52) సోమవారం మధ్యాహ్నం కోసిగి నుంచి ఐరనగల్ 523/40-42 కిలోమీటర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కోసిగయ్య తాగుడుకు బానిసై, కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మొండెం నుంచి తల తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని రైల్వే పోలీసులు తెలిపారు.
విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్తో దుర్గ్లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.
విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్తో దుర్గ్లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.
నంద్యాలలో తనపై జరిగిన దాడి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలను తమ కుటుంబం కానీ నంద్యాల పట్టణ ప్రజలు కానీ సహించబోరని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సోమవారం తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీలోని మరో వర్గానికి చెందిన తమ నాయకుడు ఫొటో లేదని పదేపదే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగారని ఫిరోజ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.