India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోటంరెడ్డి తెలిపారు.
నరసన్నపేట పట్టణంలోని కలివరపుపేట వీధికి చెందిన వైశ్యరాజు నాగరాజు(32) సోమవారం ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. కొన్నేళ్లుగా ఓ వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్ కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నాడని ఆర్థిక ఇబ్బందులు కారణంగానే తాను మృతి చెందాడని తండ్రి లక్ష్మణ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గ ప్రసాద్ తెలిపారు.
నరసాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్డులో ఉన్న గోదావరి ప్రాంతమంతా సోమవారం ఎరుపు రంగులో కనిపించిది. సాయంత్రం 5 గంటలకు సంధ్యా సమయంలో ఒక్కసారిగా మేఘాలు ఎరుపు రంగులో కమ్ముకున్నాయి. దీంతో గోదారి రంగు మారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పలువురు ఈ చిత్రాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
నందిగం మండలం దిమిలాడ గ్రామానికి చెందిన నడుపూరు సాయికిరణ్ నీట్ మెడికల్ పీజీలో రాష్ట్ర స్థాయి 316వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విజయనగరం మిమ్స్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన యువకుడు పీజీ ప్రవేశం కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను రాశాడు. ఈ మేరకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు సోమవారం ఫలితాలు వెల్లడించారు. యువకుడి తండ్రి ఎన్.వి రమణమూర్తి మెరైన్ కానిస్టేబుల్, తల్లి నవనీత గృహిణి.
ఆనందపురం ఫ్లైఓవర్ వంతెన వద్ద సోమవారం పల్సర్ బైక్ దగ్ధం అయింది. నవీన్ అనే యువకుడు విశాఖ నుంచి సాలూరు బైక్పై వెళుతుండగా ఫ్లైఓవర్ వంతెన వద్ద ఆకస్మికంగా బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన నవీన్ బైక్ నిలిపివేశాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం కోర్టు మానిటరింగ్ సిస్టం సిబ్బందితో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కేసులు పరిష్కారం, శిక్షలు పడేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులు చాలా కీలకం అని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా వివిధ కోర్టులో విచారణలో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 14, 15వ తేదీలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన 11వ ఏపీ అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన కుమారి నంద పాల్గొని 2 పతకాలు సాధించారు. ఈమెను పలువురు అభినందించారు.
చిన్నమండెం మండల వ్యాప్తంగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి కోలాహలం మొదలైంది. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలు డప్పులు, మేళతాళాలు, బాజా భజంత్రీలు, బాణసంచా పేలుళ్ల నడుమ బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు.
ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతమని మెక్సికో ప్రతినిధులు ప్రశంసించారు. సోమవారం మండలంలోని ఉదయ మాణిక్యం గ్రామంలో వారు పర్యటించారు. మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా నేటివిటీ నేతృత్వంలో మెక్సికో బృంద సభ్యులు పర్యటించారు. ఉదయ మాణిక్యం గ్రామంలో గ్రామ ఐక్య సంఘ ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ అమలులో తమ పాత్రను వివరించారు.
ఆక్రమణలు తొలగింపుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోకన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. సోమవారం చిలకలూరిపేట జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ విచ్చలవిడిగా చెరువులు కాలవలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఆక్రమణల వలన జరిగే నష్టానికి ప్రస్తుత వరదలు ఉదాహరణ అని చెప్పారు. వెంటనే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు.
Sorry, no posts matched your criteria.