Andhra Pradesh

News April 1, 2025

‘యువతిని చంపి 100 కి.మీలు బైక్‌పై తీసుకొచ్చారు’

image

సాలూరులో <<15956319>>యువతి హత్య<<>> కేసును పోలీసులు చేధించిన విషయం తెలిసిందే. యువతి మెడపై 2 గాయాలు ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాంబాబు ఐశ్యర్యను విశాఖ జిల్లా ఆరిలోవలోని ఓ రూములో చంపినట్లు తేలింది. అక్కడి నుంచి స్నేహితుల సాయంతో సాయంతో డెడ్‌బాడీని బైక్‌పై 100 KM తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీశాడు. బైక్‌పై వచ్చినప్పుడు రికార్డ్ అయిన CC ఫుటీజీ ఆధారంగా రాంబాబును అరెస్ట్ చేశారు.

News April 1, 2025

పెదచెర్లోపల్లి: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

పెద చెర్లోపల్లి మండలంలో దివాకరపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పర్యటించారు. గ్రామంలో బుధవారం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేశ్, అనంత్ అంబానీలు వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్రతో కలసి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

News April 1, 2025

కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.

News April 1, 2025

‘విశాఖలో చంపి సాలూరులో వేలాడదీశారు’

image

సాలూరు మండలంలో గత నెల జరగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. సాలూరు మండలానికి చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. రాంబాబు యువతిని ఆరిలోవలోని ఓ రూములో చంపి ఫ్రెండ్స్ సాయంతో బైక్‌పై తీసుకెళ్లి సాలూరులోని జీడితోటలో చెట్టుకు చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యలా చిత్రీరించాడు.

News April 1, 2025

యువతిని చంపి జీడితోటలో చెట్టుకు వేలాడదీశాడు

image

సాలూరు మండలం చీపురువలసలో జరిగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. ఓ పెళ్లిలో దత్తివలసకు చెందిన వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడ్ని గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. ఈ క్రమంలో రాంబాబు యువతిని చంపి చెట్టుకు చున్నీతో వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు.

News April 1, 2025

కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

image

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..

News April 1, 2025

రేపు ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన

image

ఒంగోలు కలెక్టరేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ ఎర్రయ్య మంగళవారం తెలిపారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే 30% ఐఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సీపీఎస్, జీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

News April 1, 2025

ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ తీవ్ర హెచ్చరికలు 

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా SP గంగాధరరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రవీణ్ పగడాల మృతి కేసును పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసినా, ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. 

News April 1, 2025

కర్నూలు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ@9Am.!

image

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటలకు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,38,302 మందికి గానూ 1,29,522 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

News April 1, 2025

విశాఖ: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

image

విశాఖలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. జీవీఎంసీ జోన్-4 జేఎస్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈరోజు సాయంత్రంలోగా శతశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.