Andhra Pradesh

News April 1, 2025

విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

image

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.

News April 1, 2025

వజ్రపుకొత్తూరు: గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి

image

సముద్రంలో గల్లంతైన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన బొంగు ధనరాజు (35), వంక కృష్ణారావు (40) చనిపోయారు. మృతులకు భార్యాపిల్లలు ఉన్నారు. నలుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుల మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 1, 2025

కృష్ణా: చిన్నారి మృతి.. హృదయవిదారకం 

image

కృష్ణా (D) అవనిగడ్డ(M) పులిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి వాసులు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 నెలల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారికి నామకరణం చేసేందుకు మోపిదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని తరలిస్తుండగా కారు వెనుక సీటులో పసికందు పోలీసులకు కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పాపను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

News April 1, 2025

అనంతసాగరం: ఈతకెళ్లి యువకుడి మృతి

image

ఈతకెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన అనంతసాగరం మండలంలో మంగళవారం జరిగింది. అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ బాష (21) సోమశిల ఉత్తర కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 1, 2025

తెనాలి: చిన్నారి మృతి.. హృదయవిదారకం

image

కృష్ణా (D) అవనిగడ్డ(M) పులిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి వాసులు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో 2 నెలల శిశువు కూడా ఉంది. ఆ చిన్నారికి నామకరణం చేసేందుకు మోపిదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని తరలిస్తుండగా కారు వెనుక సీటులో పసికందు పోలీసులకు కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పాపను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

News April 1, 2025

జీవీఎంసీకీ ఆస్తి పన్ను రూపంలో రూ.510 కోట్లు

image

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇన్‌ఛార్జ్ కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.

News April 1, 2025

కృష్ణా: దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు

image

కృష్ణా జిల్లా పులిగడ్డ వారిధి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తెనాలి చెంచుపేటకు చెందిన రవీంద్ర మోహన బాబు కుటుంబంతో సహా కారులో మోపిదేవి ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 21 రోజుల పసికందుతో సహ రవీంద్ర, అతని భార్య అరుణ, మనుమరాలు(5) ప్రమాదంలో మృతిచెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. 

News April 1, 2025

కర్నూలు జిల్లాలో 9 కరవు మండలాలు.!

image

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో కర్నూలు జిల్లాలో 9 మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఆస్పిరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలను తీవ్ర కరవు ప్రాంతంగా గుర్తించింది. మిగిలిన మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

News April 1, 2025

వి.కోట : రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి 

image

వి.కోట – పలమనేరు ప్రధాన రహదారిలో రాఘవపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు. అతను రామకుప్పం మండలం కంచిదాసనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గురుమూర్తిగా సమాచారం. మంగళవారం ఉదయం రాగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

News April 1, 2025

అనంతపురం జిల్లాలో 7 కరవు మండలాలు.!

image

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో అనంతపురం జిల్లాలో మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాకిడి, విడపనకల్లు మండలాలకు స్థానం లభించింది. మిగతా మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.