Andhra Pradesh

News September 16, 2024

ఇబ్రహీంపట్నం SIపై ముంబై నటి జెత్వానీ ఫైర్

image

ముంబైకు చెందిన సినీ నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం PSలో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆమె స్టేషన్‌లో ఉన్న ఓ SIపై ఆగ్రహం వ్యక్తం చేయటం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి తనను బంధువుల వద్ద నుంచి అప్పట్లో ఇబ్రహీంపట్నానికి తీసుకువచ్చింది ఈయనే అంటూ ఆమె SIపై గట్టిగా అరిచింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె వైపు చూస్తూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘాపెట్టారు.

News September 16, 2024

ఓడినా అప్పలరాజుకు బుద్ధి రాలేదు: మంతెన

image

రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్యనే తెలియని మాజీ మంత్రి అప్పలరాజు ఎంబీబీఎస్ సీట్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండడిపడ్డారు. ‘అప్పలరాజు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. అందుకే చంద్రబాబు మెడికల్ సీట్లు తగ్గించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పలాస ప్రజలు ఆయనను ఓడించినా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా అప్పలరాజు నోరు తగ్గించుకోవాలి’ అని మంతెన సూచించారు.

News September 16, 2024

వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా

image

NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News September 16, 2024

విచారణకు సహకరించని నందిగం సురేశ్.?

image

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన విచారణకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా తనకేమీ తెలియదు అన్నట్లు సురేశ్ వ్యవహరించారని విశ్వసనీయ సమాచారం. కాగా సురేశ్‌ను పోలీసులు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించనున్నారు.

News September 16, 2024

మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

image

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(M) మొగిలి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. తిరుమల నుంచి పలమనేరు వైపుగా వస్తున్న RTC బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనగా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన పద్మావతి చికిత్స పొందుతూ అదివారం మృతి చెందింది.

News September 16, 2024

కడప: 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజాప్రయోజన పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీస్ అధికారులు వెల్లడించారు. మిలాన్ ఉన్ నబీ పండగ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం పేర్కొన్నారు.

News September 16, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.33

image

అనంతపురం జిల్లాలో టమాటా కిలో రూ.33 పలుకుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని కక్కలపల్లి టమాటా మార్కెట్లో గరిష్ఠంగా రూ.33తో క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. దాదాపు 2,250 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. ఇక కిలో సరాసరి ధర రూ.25, కనిష్ఠ ధర రూ.17గా ఉందని వివరించారు.

News September 16, 2024

శ్రీకాకుళం: బదిలీపై జిల్లాకు ముగ్గురు డీఎస్పీలు

image

శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై ముగ్గురు డీఎస్పీలు వస్తున్నట్లు ఆదివారం మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి డీజీపీ ద్వారకాతిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. సీఐడీ డీఎస్పీగా ఉన్న ఎ.బి.జి. తిలక్ కాశీబుగ్గ డివిజన్‌కు, ఏఎన్టీఎఫ్ వెయిటింగ్ అటాచ్ గా ఉన్న డీఎస్పీ బి.రాజశేఖర్ శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌కు, వెయిటింగ్ డీఎస్పీగా ఉన్న ప్రసాద్ డీపీటీసీకి బదిలీపై రానున్నారన్నారు.

News September 16, 2024

ATP: పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారని యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన విజయ్ కుమార్ మేనమామ కుమార్తెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి ఇంట్లో సంప్రదించగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 16, 2024

కాకినాడ: అనుమానంతో భార్యను కడతేర్చాడు

image

విశాఖపట్నం నక్కవానిపాలెంలో కాకినాడకు చెందిన సలోమి (28)ని భర్త డానియల్ అనుమానంతో హతమార్చాడని విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మురళి ఆదివారం తెలిపారు. ఇంట్లో భార్యను గొంతు నలిమి హత్య చేసి, కొడుకుని తీసుకొని కాకినాడ వెళ్లి పోలీసులకు లొంగిపోయాడని తెలిపారు. సలోమి హోటల్లో సూపర్వైజర్‌గా పని చేస్తందని, డానియల్ చర్చిలో వీడియో గ్రాఫర్‌గా పనిచేస్తారన్నారు. సలోమి తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.