Andhra Pradesh

News February 2, 2026

మైదుకూరుకు చేరుకున్న బండ్ల గణేశ్ పాదయాత్ర

image

సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేపట్టిన తిరుమల పాదయాత్ర సోమవారం మైదుకూరుకు చేరుకుంది. ఈయన హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు మైదుకూరుకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికీ 350 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైందని గణేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. వచ్చే సోమవారం నాటికి తిరుమలకు చేరుకుంటానన్నారు.

News February 2, 2026

GNT: కళాతపస్వి కె. విశ్వనాథ్ వర్ధంతి నేడు

image

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని దశదిశలా చాటిన దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ వర్ధంతి నేడు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పెదపులివర్రులో జన్మించారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి చిత్రాలతో సంస్కృతికి పెద్దపీట వేశారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

News February 2, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. కలెక్టర్ సిరి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో వచ్చే ప్రజల అభ్యర్థనలను అధికారులు బాధ్యతతో పరిశీలించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు అర్జీలను నాణ్యతతో పరిష్కరించి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 2, 2026

ప్రకాశం జిల్లా అవతరణం జరిగింది నేడే..!

image

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.

News February 2, 2026

ప్రకాశం జిల్లా అవతరణం జరిగింది నేడే..!

image

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.

News February 2, 2026

కడప: కానిస్టేబుల్‌పై కుక్క దాడి

image

కలసపాడులో కుక్కలు అధికంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను కుక్క కరవడంతో ఆయన గాయపడ్డారు. ప్రతి రోజు ఇలా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మరి మీ ప్రాంతంలో కుక్కల బెడద ఎలా ఉంది? కామెంట్.

News February 2, 2026

చిత్తూరు జిల్లాలో విషాదం.. వేడి నీళ్లలో పడి చిన్నారి మృతి

image

వెదురుకుప్పం (M) పాతగుంట గ్రామానికి చెందిన జి మధు (3) సోమవారం వేడి నీటిలో పడి శరీరం పూర్తిగా కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల అత్యవసర చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News February 2, 2026

ప్రకాశం జిల్లా అవతరణం జరిగింది నేడే..!

image

ప్రకాశం జిల్లా నేడు అవతరించిన రోజు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొంత భాగాన్ని వేరుచేసి 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అనంతరం 1972లో జిల్లా వాసి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీదుగా జిల్లాకు ప్రకాశమని నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం నుంచి విడిపోయిన మార్కాపురం డివిజన్ జిల్లాగా అవతరించింది.

News February 2, 2026

విశాఖ:100 రోజులు బంగ్లాదేశ్‌లో బందీలుగా

image

విశాఖ నుంచి వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో చొరబడటంతో<<19027027>> 100 రోజులు బందీలుగా<<>> అక్కడ వేదన జీవితాన్ని గడిపారు. సోమవారం విశాఖ చేరుకున్న వీరికి సంఘం పెద్దలు, కుటుంబ సభ్యులు సన్మానించి కన్నీటి పర్యంతం అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో సుధాసాగర్ వీరికి నిత్యవసర సరకులు అందించారు.

News February 2, 2026

నెల్లూరు జిల్లాకు కొంత ఊరట.. కొంత నిరాశ!

image

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఈసారి నెల్లూరు జిల్లాకు నిరాశే మిగిలింగి. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్, మరే కొత్తదానికి అదనంగా నిధులు ఇవ్వలేదు. చెన్నై-బెంగళూరు కారిడార్(CBIC) పరిధిలోని నెల్లూరు క్రిస్ సిటీని రూ.621Crతో రాష్ట్రప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఇప్పటికే రూ.531 Crను కేంద్రం విడుదల చేసింది. మిగిలిన పనుల పూర్తికి రూ.90 Cr కేటాయించే అవకాశం ఉంది.