India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రవర్తి గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించారు. ఆయన 1971 నుంచి 1989 వరకు సంగీత రంగాన్ని ఏలారు. 959 సినిమాలకు సంగీతం, దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ ఇచ్చారు. 1989లో విడుదలైన 95 సినిమాల్లో 66 చిత్రాలకు సంగీతం అందించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2002 ఫిబ్రవరి 3న ఆయన కన్నుమూశారు.

వచ్చే మూడు రోజుల్లో కుటుంబ సర్వేను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన, ఇప్పటివరకు 60% పూర్తైందని, దీనిని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమం కింద గుర్తించిన 1.10 లక్షల నిరక్షరాస్యులను మార్చి నెల ప్రత్యేక పరీక్షకు సిద్ధం చేయాలని, వాలంటీర్ల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని సూచించారు.

రాజానగరం ZP ఉన్నత పాఠశాలలో ఈనెల 8న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MLA బత్తుల బాలరామకృష్ణ మంగళవారం తెలిపారు. ఇందులో 60 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని 3000 మందికి ఉపాధి కల్పిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థులకు శుభవార్త. గన్నవరంలో నూతన ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, హాస్టల్ సౌకర్యాలతో ఈ కళాశాలను తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక విద్య, పరిశోధనలకు ఇక్కడ పెద్దపీట వేయనున్నారు. ఈ కళాశాల అందుబాటులోకి రావడం వల్ల స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి వ్యవసాయ రంగంలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.

పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్ మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుపై ఉన్న 18 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఇటీవల రాజమండ్రి MP పురందీశ్వరి రైతులతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి సుంకం ఎత్తివేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పొగాకు రైతులకు భారీ ఊరట లభించనుంది.

ఆన్లైన్, బ్యాంక్, OTP, UPI/ATM/క్రెడిట్ కార్డు స్కామ్లు జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ కావడంతో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోసానికి గురైనప్పుడు 1930కి కాల్ చేస్తే బ్యాంక్కు అలర్ట్ పంపిస్తారు. https://cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు.

రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థి వి. గాలెయ్య మృతి చెందగా మరో యువకుడు గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కొలుకుల నుంచి ఎర్రగొండపాలేనికి వస్తున్న సమయంలో వరి కోత వాహనం ఢీకొని అక్కడిక్కడే గాలెయ్య మృతి చెందగా.. సండ్రపాటి నాని (16) గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని MJP గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్, బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సదుం, సత్యవేడు, తంబళ్లపల్లి, ఐతేపల్లి, కుప్పంలలో బాలురకు, కలికిరి, పీలేరు, ఉదయమాణిక్యం, పెద్దపంజాణి, పులిచెర్ల, కుప్పంలలో బాలికలకు గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. http://mjpa pbcwreir.apcfrr.in లో దరఖాస్తు చేయాలన్నారు.

అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఓ పేద కుటుంబం బలైంది. పెద్దకడబూరు(M) కమ్మలదిన్నెకు చెందిన కురవ భీరప్ప, బీరమ్మ దంపతులు గత నెల 28న పురుగు మందు తాగారు. అదేరోజు భీరప్ప మృతి చెందగా, బీరమ్మ కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు విస్తృత స్థాయిలో రాత్రివేళ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Sorry, no posts matched your criteria.