Andhra Pradesh

News October 4, 2024

యలమంచిలి: రూ.100 కోసం బ్లేడ్‌తో దాడి

image

అప్పుగా ఇచ్చిన రూ.100 కోసం ఓ వ్యక్తిపై పదునైన బ్లేడ్‌తో దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నూకిరెడ్డి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణకు రూ.100 అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాస్‌పై వెంకటరమణ బ్లేడ్‌తో దాడి చేశాడు.

News October 4, 2024

కడప: ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లు

image

వైవీయూ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో నేరుగా ప్రవేశాలు (ఏ.పి.ఐ.సి.ఈ.టి-2024) కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలోని డీఓఏ కార్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్‌‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుసుంతో రావాలన్నారు.

News October 4, 2024

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌పై వేటు

image

బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్ మురళీకృష్ణపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేసినట్లు ఏపీవో, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు జేసీ ధాత్రిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పాఠశాలలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపల్ విజయలక్ష్మిని గురుకులానికి సరెండర్ చేశారు.

News October 4, 2024

విశాఖ: ఆకాశాన్ని అంటుతున్న టమాటా ధరలు

image

టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 కాగా, రైతు బజార్లలో రూ.66కి విక్రయిస్తున్నారు. రాయితీపై టమాటాను విక్రయించాలని విశాఖ నగర ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజుల కిందట కిలో టమాటా ధర రూ.66 ఉండగా అదనంగా రూ.22 పెరిగింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టమాటా జోలికి వెళ్లటం లేదు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

News October 4, 2024

VZM: పవన్ ప్రసంగం కోసం LED స్క్రీన్

image

పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగాన్ని కోట జంక్షన్‌లో గురువారం రాత్రి LED స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించారు. తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, అవనాపు భావన దంపతులు భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, జనసైనికులు, నాయకులు ప్రత్యక్షంగా తిలకించారు.

News October 4, 2024

ప్రకాశం: అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు

image

ప్రకాశం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర తెలిపారు. ఈ నెల 14న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

News October 4, 2024

ATP: 2,79,161 మందికి రూ.55.83 కోట్లు

image

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు నిధులు విడదల చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమకానుంది. అనంతపురం జిల్లాలో 2,79,161 మందికి రూ.55.83 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.

News October 4, 2024

NLR: బాలికపై లైంగిక దాడికి యత్నం

image

బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటాచలం మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక టిఫిన్ తెచ్చుకునేందుకు బయల్దేరింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 4, 2024

కర్నూలు: లా పరీక్ష ఫలితాల విడుదల

image

రాయలసీమ వర్సిటీ పరిధిలో జరిగిన (2023) లా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్‌లో 153 మంది, మూడో సెమిస్టర్‌‌లో 1,509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్‌లో 32 మంది, మూడో సెమిస్టర్‌లో 37 మంది, మూడేళ్ల కోర్సు సప్లమెంటరీ మొదటి సెమిస్టర్‌లో 38 మంది, మూడో సెమిస్టర్‌లో 17 మంది ఉత్తీర్ణులయ్యారు.

News October 4, 2024

కడప: నూతన పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

image

కడప జిల్లాలో నూతన పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేపట్టి ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జేసీ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో మొత్తం ఇప్పటికే 1941 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 22 ప్రతిపాదనలు చేశామని, ఇందులో కడపలో 19, ప్రొద్దుటూరులో 1, కమలాపురంలో 2 కేంద్రాలు ఉన్నాయన్నారు.