Andhra Pradesh

News September 16, 2024

VZM: జాతీయస్థాయిలో జిల్లాకు టైక్వాండో పతకాలు

image

ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిన జాతీయ సబ్ జూనియర్ టైక్వాండో పోటీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరింది. ఈ పోటీలలో విజయనగరానికి చెందిన క్రీడాకారులు 8 మెడల్స్ సాధించినారు. కే.సాహిత్య – 1 గోల్డ్ 1 బ్రాంజ్, పీ.పునీత్ – 1 సిల్వర్ 2 బ్రాంజ్, వి. కుషాల్ – 1 సిల్వర్ 1బ్రాంజ్, ఎస్.సాత్విక్ – 1 సిల్వర్ గెలుపొందారు. క్రీడాకారులకు రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు.

News September 16, 2024

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

image

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.

News September 16, 2024

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ ఆదివారం తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. సెప్టెంబర్ 23న తిరిగి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తామన్నారు.

News September 16, 2024

ప్రకాశం: ‘మీకోసం’ తాత్కాలికంగా రద్దు

image

సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా (పబ్లిక్ హాలిడే) జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గుర్తించి దూర ప్రాంతాల నుంచి ఎవరు రావద్దని సూచించారు.

News September 16, 2024

తూ.గో: పెద్దాపురంలో వికసించిన బ్రహ్మ కమలం

image

హిమాలయ పర్వత శ్రేణుల్లో పెరిగే బ్రహ్మ కమలం పెద్దాపురంలో కొత్తపేట రామాలయం వీధికి చెందిన ఆదిరెడ్డి విజయలక్ష్మి ఇంటి పెరటిలో ఆదివారం వికసించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూసే బ్రహ్మ కమలం మొక్కను ఆమె తులసి కోటలో నాటగా బ్రహ్మ కమలం వికసించటంతో ఆదివారం ఈ కమలాన్ని చూడడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు.

News September 16, 2024

కడప: ‘ఇసుక పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేయాలి’

image

ఇసుక పంపిణీ నియమ నిబంధనలో మేరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్‌వో గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.

News September 16, 2024

వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా

image

NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News September 16, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

ఈద్ – ఎ -మిలాద్ ఉన్ నబీ ప్రభుత్వ సెలవు దినం కావడం వలన సెప్టెంబర్ 16న సోమవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ఉండదని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సోమవారం వినతులతో జిల్లా కలెక్టరేట్ కూ వ్యయ ప్రయాసాలకోర్చి రావొద్దని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని ఆ ప్రకటనలో కోరారు.

News September 16, 2024

నెల్లూరు :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

News September 16, 2024

జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ రద్దు: ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు.