Andhra Pradesh

News March 31, 2025

జీవీఎంసీలో రూ.510 కోట్ల ఆస్తిపన్ను వసూలు

image

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇంచార్జి కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో  రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు. 

News March 31, 2025

విశాఖలో బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు అరెస్ట్: సీపీ

image

క్రికెట్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడితో పాటు ప్రమోట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తూ విశాఖలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రవీణ్ కుమార్, మదీనావలి, రజియాబేగం, ధరణి అనే వారిని అరెస్టు చేశామని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లపై సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

News March 31, 2025

కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు

image

విశాఖ కేజీహెచ్‌లో ఏప్రిల్ 1 నుంచి అన్ని పని రోజులలో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండ్ శివానంద్ సోమవారం తెలిపారు. గతంలో ఒక్కో రోజు ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైద్యానికి ఓ.పి.విభాగాలు పని చేసేవన్నారు. కానీ రేపటి నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4 వరకు ఓ.పి. చూస్తారని వెల్లడించారు. ప్రజలు గమనించాలని కోరారు.

News March 31, 2025

ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

image

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 31, 2025

మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తవణంపల్లె మండలం పైమాఘానికి చెందిన రాజేశ్వరి తన భర్తతో కలిసి మొగిలీశ్వర స్వామి గుడికి బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేశ్వరికి అక్కడికక్కడే చనిపోగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.

News March 31, 2025

KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

image

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.

News March 31, 2025

సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి: పల్లా

image

టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు.

News March 31, 2025

కర్నూలు: రూ.71.47 కోట్ల పన్నులు వసూలు

image

నగరాభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలనే కర్నూలు నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. స్పందించిన బకాయిదారులు అత్యధిక సంఖ్యలో పన్నులు చెల్లించినందుకు నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయేలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు కేఎంసీ కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.71.47 కోట్లు పన్ను రూపంలో వసూలు అయినట్లు తెలిపారు.

News March 31, 2025

నెల్లూరు : ఈ రోజు రాత్రి 12 గంటల వరకే..

image

ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత యథావిధిగా రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ బడుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేసి ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని సూచించారు.

News March 31, 2025

జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ కానున్న పవన్‌కళ్యాణ్

image

సీతమ్మధార జనసేన కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. క్యాంపు రాజకీయల సంస్కృతి పార్టీలో ఉండకూడదన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని వెల్లడించారు. త్వరలో అమరావతిలో 11 మంది జనసేన కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుందని ఆయన తెలిపారు.