India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ బాలోత్సవ భవన్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని సరిదిద్దాలని కోరారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలో పడి అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వారధి కృష్ణ చనిపోయాడు స్థానికులు తెలిపారు. మృతుడు ఆదివారం నుంచి కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సుమారు 11 గంటల ప్రాంతంలో స్థానికులు గెడ్డలో శవం ఉన్నట్లు తెలిసి వెళ్లి చూడగా అతను వారధి కృష్ణగా గుర్తించారు. ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి వైపు నుంచి మోపిదేవికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనసేనపై మరోసారి మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తనదైన శైలిలో ట్విటర్లో విమర్శలు చేశారు. ‘బాబుకు సుత్తి కొట్టడమే.. సత్తా లేని జనసేన పని.!’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ పని చేసినా, దానిని గుడ్డిగా సమర్థించడమే పవన్ కళ్యాణ్కు పనిగా మారిందని కొంతమంది కామెంట్లు చేయగా, అంబటి రాంబాబును విమర్శిస్తూ మరి కొంతమంది ఆ ట్వీట్ కింద కామెంట్లు చేస్తున్నారు.
నాలుగేళ్ల పాలనలో ఎలాంటి తప్పు చేయలేదని, సొంత పార్టీ ఐనా వైసీపీ కౌన్సిలర్లు తనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిరసిస్తూ ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంత దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సోమవారం 12వ రోజుకు చేరుకుంది. ఉగాది, రంజాన్ పండగలు ఉన్నప్పటికీ ఈనెల 20 నుంచి దీక్ష నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయాలని శాంత కోరారు.
అనంతపురం జిల్లా యాడికి మండలం పెద్ద పేటలో మంగళవారం జూనియర్ విభాగంలో రాతిదూలం పోటీలు నిర్వహించనున్నట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. శ్రీ సంజీవరాయ స్వామి ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి ఉన్న జిల్లా రైతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.
గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
లావేరు(M) భరణికానికి చెందిన జిరాక్స్ షాపు యజమాని ఏ.హరికృష్ణకు ఒంగోలుకు సంబంధించిన GST డిప్యూటీ సహ కమిషనర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రూ.36,13,000 పన్ను బకాయి ఉన్నట్లుగా నోటీసులో ఉండటంతో అతను కంగుతిన్నాడు. తాను ఒంగోల్లో ఏ వ్యాపారం చేయలేదని, గతంలో బార్లో పని చేశానని పేర్కొన్నారు. అయితే ఒంగోల్లో హరికృష్ణ పేరు మీద హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.
విశాఖలో మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వేపగుంటలో ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. సుజాత నగర్ టీచర్స్ లేఅవుట్లో 150 గజాల స్థలాన్ని ఆక్రమించారని లక్ష్మి అనే మహిళ వినతి అందించారు.
Sorry, no posts matched your criteria.