Andhra Pradesh

News March 24, 2025

MTM: పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి – కలెక్టర్

image

మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు 19,839 అర్జీలు అందగా అందులో ఇంకా 2,235 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలన్నారు.

News March 24, 2025

చీపురుపల్లి: అబ్బాయ్‌ను బాబాయ్ పక్కన పెడుతున్నారా..?

image

చీపురుపల్లి TDPలో కలహాలు తారస్థాయికి చేరుకున్నాయనే గుసగుసలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ప్రస్తుత MLA కళా వెంకట్రావుకు, TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొసగడం లేదని టాక్. ఇటీవల TDP ఆఫీస్ ప్రారంభానికీ నాగార్జున రాకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. రానున్న ఎన్నికల్లో తన కుమారుడు రామ్ మల్లిక్‌కు లైన్ క్లియర్ చేసేందుకు కళా యత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

News March 24, 2025

రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం.. మీ కామెంట్

image

రాజకీయ చైతన్యం గల చిలకలూరిపేటలో పాలిటిక్స్ వేడెక్కాయి. నియోజకవర్గంలో బలమైన నేతయిన మర్రి రాజశేఖర్ TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు TDPలో చక్రం తిప్పిన సీనియర్ లీడర్, MLA పత్తిపాటి పుల్లారావు స్పందనెలా ఉంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటు ప్రతిపక్షం నుంచి విడదల రజినీ బలంగా YCP గొంతు వినిపిస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి, మర్రి వర్సెస్ రజినీగా రాజకీయం రసవత్తరంగా మారింది.

News March 24, 2025

కృష్ణాజిల్లాలో పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

image

కృష్ణాజిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో 21,771 మంది విద్యార్థులకు గాను 21,419 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

News March 24, 2025

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోటపల్లిగూడూరు వాసి

image

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్‌కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

News March 24, 2025

తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

image

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.

News March 24, 2025

నెల్లూరు: ఆన్‌లైన్‌లో పరిచయం.. రూ.18 లక్షల మోసం

image

హనీ‌ట్రాప్‌కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.

News March 24, 2025

VZM: ఈ నెల 25,26 తేదీల్లో APPSC ప‌రీక్ష‌లు

image

ఈ నెల 25,26 తేదీల్లో జ‌ర‌గ‌నున్న APPSC ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని DRO ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజ‌నీర్‌, 25, 26 తేదీల్లో పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులోని అన‌లిస్ట్ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌కు, 26న డిప్యుటీ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.

News March 24, 2025

ఎల్లనూరు మండలంలో 971 ఎకరాలలో పంట నష్టం

image

ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

News March 24, 2025

VZM: టెన్త్ పరీక్షలకు 22,786 మంది హాజరు

image

సోమవారం జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన టెన్త్ గణితం పరీక్షలకు 22,786 మంది విద్యార్థులు హాజరుకాగ 104 మంది గైర్హాజరు అయ్యారని విజయనగరం జిల్లా విద్యా శాఖాధికారి మాణిక్యం నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం విద్యార్థులు 22890 మంది హాజరు కావాల్సి ఉండగా 22,786 మంది మాత్రమే హాజరైయ్యారని అన్నారు. విద్యార్థులు హజరు 99.55% శాతంగా నమోదు అయిందని, పరీక్ష సజావుగా జరిగిందని తెలియజేసారు.