India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం కోరారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటీఐ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమలో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఓ ప్రకటనలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు.
న్యాయవాదుల డెత్ బెనిఫిట్ను ఆరు లక్షలకు పెంచుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం హైకోర్టులో జరిగిన కౌన్సిల్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ మొత్తం ఐదు లక్షల రూపాయలుగా ఉంది. అనారోగ్యానికి గురైన వారికి ఒకటిన్నర లక్ష ఇవ్వనున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ తీర్మానాలు అమల్లోకి వస్తాయి. ప్రమాదవశాత్తు మరణించిన వారికి పై మొత్తంతో సంబంధం లేకుండా మరో ఐదు లక్షలు ఇస్తారు.
జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుమ్మానూరు నారాయణకు బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. విజయవాడలో ఆపార్టీ నేతలతో నారాయణ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దూకుడైన యువనేత అవసరమని భావిస్తోన్న పార్టీ.. నారాయణకే బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో గుమ్మానూరు కుటుంబానికి బలమైన క్యాడర్ ఉన్న విషయం తెలిసిందే.
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫారంపాండ్ నీటి కుంటలకు కేరాఫ్ ఆలూరు. 2014 ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మండలంలోని పెద్దహోతూరు గ్రామం వద్ద పైలెట్ ప్రాజెక్టుగా వీటిని తవ్వించారు. వాటి ఉపయోగం గురించి అప్పట్లో రైతులకు అవగాహన సైతం కల్పించారు. ఈ ప్రాంతంలో నీటి కుంటలు విజయవంతమవడంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కుంటల తవ్వకాలు చేపట్టారు. ఇక్కడి ఉపాధి సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీటిపై ట్రైనింగ్ ఇచ్చారు.
బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కొనకొండ్ల రాజేశ్ ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురం నగరం షిరిడి నగర్ లేడీస్ హాస్టల్లో కురుబ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో కొనకొండ్ల రాజేశ్ను ఘనంగా సన్మానించారు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసి, అంచలంచలుగా ఎదిగి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో కురుబ కులస్థులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. జిల్లా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శ్రీమన్యాయసుధా మంగళ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఇతర మఠాల పీఠాధిపతులతో కలిసి దీప ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా గంధాన్ని శోభాయాత్ర చేశారు. వేదికపై శ్రీమన్యాయసుధ విద్యార్థుల అనువాదం అనంతరం అంతర్ దృష్టితో కూడిన వాఖ్యార్థ ఘోష్టి నిర్వహించారు.
చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం. వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉ.9 గం. కల్లా తప్పక హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నియోజక వర్గ, మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.