India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొమ్మనాపల్లిలో 90, బెండపూడిలో 18మంది ఈ వ్యాధిన పడ్డారు. జిల్లాలో 2022లో ఐదుగురు బాధితులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటడం భయం కలిగిస్తోంది. అధికారులు వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
➠ వ్యాధి లక్షణాలు
☛ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి
☛ దాహం, నోరు ఎండిపోవడం
☛ మూత్ర విసర్జన తగ్గిపోవడం.
నగరంలో మంగళవారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గణేశ్ తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన గణేశ్, శివకుమార్ అనే వ్యక్తులు సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తుండగా దాడి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్పై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశాడన్నారు. విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ మలికా గర్గ్కి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం అల్లూరు గ్రామం మాండ్ర శివానందరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సబ్సిడీల ద్వారా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులు, ఏపీఐఐసీ, సోలార్ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్, ఎంఐజి లేఅవుట్, రైల్వే, సాంఘిక సంక్షేమ శాఖల భవనాలకు సంబంధించి భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. భూ కేటాయింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ శాఖలలో ప్రజలకు అందించే రోజువారి సేవలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయ సేవలు, భూ సేకరణ, సివిల్ సప్లై తదితర అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.
ప.గో జిల్లా నరసాపురం మండలంలో మహాత్మ జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాల (బాలికలు)లో 6 నుంచి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను రిజర్వేషన్ అనుసరించి ఈనెల 20వ తేదిన 6, 8 తరగతులకు, 21వ తేదిన 7, 9 తరగతులకు రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ Ch.K.శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామికి కలెక్టర్ పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.
కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీన ఇటర్వ్యూలు ఉంటాయని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వేణుగోపాల వర్మ మంగళవారం తెలిపారు. కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. 554 మందికి ఈ నెల 20 నుంచి 25వ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
కష్టకాలంలో జండా మోసిన ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని మంత్రి అచ్చనాయుడు అన్నారు. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం చేరుకున్న ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని వారి సేవలను పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రజల మంచి కోరే పనులు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.