India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వాసి సముద్రంలో గల్లంతయ్యాడు. పెమ్మాడి కాయరాజు(33) సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, పడవలో నుంచి జారిపడి మునిగిపోయినట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. మంగళవారం విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన మత్స్యకారులతో కలిసి కాయరాజు వేటకు బయలుదేరి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ పడవలో నుంచి జారి పడినట్లు వారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు వివరించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ను రూపొందించామని డీసీపీ సత్తిబాబు తెలిపారు. విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు యాక్షన్ టీమ్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీపీఈడీ నాల్గవ సెమిస్టర్ (రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://results.andhrauniversity.edu.in/లో చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఎన్నికల ముగిసి నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది గ్రామాలలో ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పర్చుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నెలవారి క్రైమ్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో సమస్యలు రాకుండా విధి నిర్వహణ కలిగి ఉండాలని జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ను రూపొందించామని డీసీపీ సత్తిబాబు తెలిపారు. విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు యాక్షన్ టీమ్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజంపేటలో టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం మంగళవారం ఉండవల్లిలో భేటీ అయ్యారు. రాజంపేట నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలను చంద్రబాబుకు సుగవాసి వివరించారు. రాజంపేటను జిల్లా చేయడం, మెడికల్ కాలేజ్, అన్నమయ్య ప్రాజెక్ట్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను సత్యసాయి జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డితో పాటు పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం సత్యసాయి జిల్లా పరిస్థితులపై చర్చించారు.
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం కారు, లారీ ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్తున్న కారు, నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వస్తున్న లారీ మూల మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు.
నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై నట్టేటి చెంగయ్య (70)ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పంట పొలాల వద్దకు నడిచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ- జక్కంపూడి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కొత్తపేట సీఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన హర్షవర్ధన్ కంచికచర్లలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కాలేజీ పూర్తవగానే మంగళవారం మధ్యాహ్నం విజయవాడ బయలుదేరి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ టైరు అతనిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.