India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం జగన్ బుధవారం పులివెందుల పర్యటనకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో పులివెందుల చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు.
నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ = ఎంపికైన విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం ఎంపికైన విద్యార్థులు స్కాలర్ షిప్ కొరకు బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేయించుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పేర్కొన్నారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో 9, 10, 11,12 తరగతులు చదువుతూ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో నమోదుచేసుకున్న విద్యార్థులు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఆ ఘోర ప్రభావం నుంచి నేతలు ఇంకా కోలుకోలేదు. ఒకరు ఇద్దరు మినహా మిగిలిన వాళ్లు ఎవరూ ఇప్పటికీ చాలామంది ప్రజల్లోకి రాలేదు. నిన్న బక్రీద్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యేలు పలు చోట్ల ప్రార్థనల్లో పాల్గొనగా.. వైసీపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షల పోస్ట్లకే పరిమితమయ్యారు. మరోవైపు నేతల భరోసా కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయంకు ఇన్ ఫ్లో సుంకేసుల జలాశయం నుంచి 2647 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, జలాశయ ప్రస్తుత నీటి మట్టం 813.40. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 36.3480 టీఎంసీలుగా నమోదైంది.
నరసాపురం MP భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కాగా ఆయన నేడు ఢిల్లీలో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. 1980 దశకంలో ఏఐఎస్ఎఫ్లో చేరి వామపక్ష విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరాడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన తాజాగా నరసాపురం నుంచి 2,76,802 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.
గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం సుమారు ఏ/సి 75,000 బస్తాలు చేరాయి. కేజీల వారీగా సీడు రకాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.160 నుంచి 195, సూపర్ డీలక్స్ రూ.200, 341 బెస్ట్ రూ.140 నుండి రూ.175, సిజెంటా బెడిగి రూ.110, రూ.145, 2043 బెడిగి రూ.140, రూ.180, డిడి రకం రూ.130, రూ.170, నంబర్ 5 రూ.140, రూ.175, బుల్లెట్ రూ.110, రూ.170, ఆర్మూర్ రకం రూ.120, రూ.155, రోమి రకం రూ.120, రూ.160 వరకు ధర ఉంది.
మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు , ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఒంగోలులో డీఈఐఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి 27 వరకు జరుగుతాయని విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారి కె. శివకుమార్ తెలిపారు. డైట్ మైనంపాడు కేంద్రంలో జరిగే పరీక్షకు 2022-24 బ్యాచ్ విద్యార్థులు హాజరవుతారన్నారు. ఉదయం 9-11.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ప్రజల గాలి తన వైపు లేదని తెలుసుకొని, ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ అసలు మనిషేనా అని ఆమదాలవలస MLA కూన రవికుమార్ ట్వీట్ చేశారు. తాను ఓడిపోతే ప్రజలు ఓటెయ్యలేదని మాట ఒప్పుకోకుండా, ఈవీఎంల మీద జగన్ నెపాన్ని నెట్టేస్తున్నారని రవి విమర్శించారు. ఈవీఎంలను సమర్థిస్తూ గతంలో జగన్ మాట్లాడిన వ్యాఖ్యలను MLA రవి ఈ మేరకు Xలో పోస్ట్ చేసి జగన్ ట్వీట్కు కౌంటరిచ్చారు.
పాలిటెక్నిక్-2024 మొదటి కౌన్సెలింగ్ ముగిసింది. ఈ మేరకు సీటు పొందిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ సాయంత్రంలోగా కళాశాలలకు రిపోర్టులను సబ్మిట్ చేయాలి. లేదంటే ఆ అభ్యర్థులు సీటు కోల్పోయే అవకాశం ఉంది. రిపోర్ట్ చేసిన విద్యార్థులకు రెండో కౌన్సిలింగ్లో మార్పు చేసుకుని అవకాశం లభిస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా 2,674 సీట్లకు 1,427 ప్రవేశాలు జరిగాయి.
Sorry, no posts matched your criteria.