Andhra Pradesh

News October 4, 2024

విశాఖ: ‘డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ’

image

మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పోలీస్ అధికారులు పనిచేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. విశాఖలో గురువారం న్యూఢిల్లీకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో 50 మంది పోలీస్ అధికారులకు డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ మాటాడుతూ యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 4, 2024

డ్యూటీలో ఉన్నప్పుడు పరిసర కార్యకలాపాలపై నిఘా ఉంచండి

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించాలని, విధులను నిర్వర్తించడంతో పాటు, డిప్యూటేషన్ సిబ్బంది తమ పరిసరాలపై నిఘా ఉంచి, అప్రమత్తంగా ఉండాలని, సమస్యను పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధులకు హాజరైన ఉద్యోగులను ఉద్దేశించి ఈఓ, అదనపు ఈఓలు మాట్లాడారు. అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.

News October 4, 2024

సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్

image

నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 4, 2024

2047నాటికి సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్

image

స్వర్ణాంధ్ర-2047 సాధనకు అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. జిల్లాలో ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా వృద్ధి చెందడానికి తగిన సూచనలు సేకరణకు వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. గురువారం కలెక్టరేట్‌‌లో జేసీతో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2047 నాటికి సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవాలని, ఇందుకు అందరి సహకారం అవసరమన్నారు.

News October 4, 2024

విశాఖ జిల్లా TOP NEWS TODAY

image

* మాడుగుల నియోజకవర్గంలో 80 అడుగుల రోడ్డు.!
* ముంచింగిపుట్టులో గంజాయితో పట్టుబడ్డ మహిళలు
* ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్
* విశాఖ పోర్టు.. సరికొత్త రికార్డు
* విశాఖ: ఇన్ స్టా గ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్ట్
* డొంకరాయి జలాశయం వద్ద మొసలి హల్ చల్
* బుచ్చియ్యపేట: ఆవుల అక్రమ తరలింపు అడ్డగింత
* సీఎంతో భేటీ అయిన భీమిలి టీడీపీ ఇన్‌ఛార్జ్
* అల్లూరి జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక

News October 4, 2024

విజయనగరం: TODAY TOP NEWS

image

➣ రామతీర్థంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➣ భోగాపురం: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
➣ గజపతినగరం: పాముకాటుతో రైతు మృతి
➣ పైడితల్లమ్మ హుండీల్లో నకిలీ నోట్లు
➣ 151 నుంచి 11 సీట్లుకు దిగిపోయారు: కిమిడి నాగార్జున
➣ పొలాల్లోకి దూసుకెళ్లిన విజయనగరం- రాజాం BUS
➣ ఒమ్మిలో పసుపు కొమ్ములతో అమ్మవారి విగ్రహం
➣ పార్వతీపురం జిల్లాలో 7,83,972 మంది ఓటర్లు

News October 3, 2024

ఉమ్మడి తూ.గో.జిల్లా టాప్ న్యూస్

image

* జిల్లాలో రేపటి నుంచి టెట్ పరీక్షలు
* శంషాబాద్‌లో కోనసీమ వాసి మృతి
* రేపు తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా
* రాజమండ్రి: ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.కోటితో పరార్
* మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే చినరాజప్ప
* తూ.గో: బీజేపీలో చేరిన 300 కుటుంబాలు
* కాకినాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు
* ఎంపీ పురందీశ్వరికి పామాయిల్ రైతుల వినతి
* 35 రోజుల వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.1,08,89,635

News October 3, 2024

గ్రామపంచాయతీలో రైతుబజార్ల ఏర్పాటు: కలెక్టర్

image

RIDF, నాబార్డ్ గ్రాంట్ కింద గ్రామపంచాయతీలో రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో RIDF, నాబార్డ్ గ్రాంట్ బేస్డ్ ప్రాజెక్టుల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నాబార్డ్ గ్రాంట్ కింద జీవనోపాదుల కల్పనకు విరివిగా అవకాశాలున్నాయని, సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

News October 3, 2024

శ్రీకాకుళం: ల్యాబ్ టెక్నీషియన్స్ ఎన్నిక ఏకగ్రీవం

image

జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా జె.కేశవరావు, బి.అప్పలరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు ఎన్నుకున్నారు. ట్రెజరీగా విజయ్ కుమార్, అసోసియేటివ్ ప్రెసిడెంట్‌గా లూసీ ఎస్టర్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

News October 3, 2024

VZM: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

భోగాపురం పోలీస్ స్టేషన్ లో 2021లో నమోదైన హత్య కేసు నిందితుడికి జిల్లా మహిళ కోర్టు జీవిత ఖైదు, రూ. 2,500 జరిమానా విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కొంగవానిపాలెంకు చెందిన గోవింద మద్యం మత్తులో భార్య మంగమ్మను హత్య చేశాడని, మృతిరాలి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామన్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారైందని చెప్పారు.