India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాకు చేరుకున్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణీ శ్రీ, అమిలినేని సురేంద్రబాబు, అస్మిత్ రెడ్డి, ఎమ్మెస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. వైసీపీ రాతి యుగానికి ముగింపు పలికి కూటమి ప్రభుత్వం స్వర్ణ యుగానికి నాంది పలికిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వైసీపీ ఓటమితో ఎన్నికల ఫలితాల రోజే టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో కీలకమైన ఈ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నేతలు పోటీపడుతున్నారు. ముందుగా నాగబాబుకు ఛైర్మన్ పదవి ఖరారైందని వార్తలు రాగా ఆయన దీనిని ఖండించారు. ఓ టీవీ అధినేత, నిర్మాత పేరు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరకు పదవి ఎవరి దక్కుతుందో చూడాలి మరి.
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 18వ తేదీ మంగళవారం నాటి పర్యటన వివరాలను కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా స్థాయి అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 12 గంటల నుంచి కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటారు.
కొంతమంది పోలీసు అధికారులు YCP ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేశారని <<13455722>>హోం మంత్రి<<>> అనిత విమర్శించారు. వారిలో ఇప్పటికీ వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమన్న ఆమె.. సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కడప జిల్లా బద్వేలు వాసులు నెల్లూరుకు వెళ్తుండగా కారుపై పెద్దపులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తుండగా సోమవారం పులి దాడి చేసింది. ఇందులో కారు కొంత దూరం పులిని ఈడ్చుకెళ్లగా పులికి గాయాలయైనట్లు సమాచారం. ప్రమాదం తర్వాత పులి సమీప అడవిలోకి వెళ్లిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన లాల్స్వామి అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబాడి సహనంగా ఉన్నామని పేర్కొన్నారు.
రైలు ప్రమాదంలో కొత్తవలసకి చెందిన గోలజాపు పెంటయ్య(60) రెండు కాళ్లను కోల్పోయారు. బహిర్భూమికి వెళ్లి రైలు పట్టాలు దాటుతుండగా కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్-1 చివరలో విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుడికి రెండు కాళ్ళు ఛిద్రమయ్యాయి. వెంటనే 108కి ఫోన్ చేసి క్షతగాత్రుడిని విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు ఆర్పీఫ్ ఎస్సై ఆర్.హసిధ, ఏఎస్ఐ ఎ.ధర్మారావు తెలిపారు.
అత్యధిక మెజార్టీతో గెలిచి అందరినీ ఆకర్షించిన గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు ఇకపై ఏపీ TDP బాధ్యతలు మోయనున్నారు. YCP ప్రభుత్వంలో అనేక కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలిచారు. పార్టీ మారాలని ఒత్తిడి వచ్చినప్పటికీ TDPలోనే కొనసాగి విధేయతను చాటుకున్నారు. 7రోజులు ఆమరణదీక్ష చేసి స్టీల్ప్లాంట్ ఉద్యమానికి ఊపు తెచ్చిన పల్లా.. గాజువాక హౌస్ కమిటీ భూములు, అగనంపూడి టోల్ గేట్ సమస్యపై పోరాడారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ దళిత నాయకుడినైన తనపై, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గూండా గిరి చేస్తున్నారని YCP మాజీ కార్పొరేటర్ నందెపు జగదీశ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో YCP తరఫున ప్రచారం చేశాననే కోపంతో తనకు చెందిన భవనాన్ని బోండా ఉమా అనుచరులు JCBతో కూల్చేశారన్నారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన తాను కూల్చిన భవనం వద్ద <<13456099>>శిరోముండనం చేయించుకుని<<>> అర్ధ నగ్నంగా నిరసన తెలిపానన్నారు.
నెల్లూరు జిల్లాలో పెద్దపులి దాడి కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తున్న కారుపై సోమవారం ఉదయం పులి దాడి చేసింది. ఒక్కసారిగా రోడ్డుపైకి పులి రావడంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం ధ్వంసమైంది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. పెద్దపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
Sorry, no posts matched your criteria.