India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుగ్గలి మండలం రామలింగాయపల్లి సమీపంలో ఆ గ్రామానికి చెందిన నలుగురు కొండలో గొర్రెల మంద వద్ద కాపలాగా ఉండగా పిడుగు పడింది. ఈ ఘటనలో కామేశ్వరి(35), సుంకన్న(47) మృతిచెందగా.. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారి మృతదేహాలను ఇతర కాపారులు గ్రామానికి తీసుకువచ్చారు.
విశాఖ-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డిసిఎం కే సందీప్ తెలిపారు. విశాఖ-సంత్రగచ్చి స్పెషల్ ఈనెల 19, 21, 26, 28 తేదీల్లో విశాఖలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సంత్రగచ్చి చేరుకుంటుందన్నారు. అలాగే సంత్రగచ్చి-విశాఖ స్పెషల్ ఈనెల 20, 22, 27, 29 తేదీల్లో సంత్రగచ్చిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు.
పారా స్పోర్ట్సు అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 30న నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ పారా (దివ్యాంగుల) అథ్లెటిక్స్ మీట్ నిర్వహించనున్నట్టు సంఘ కార్యదర్శి రామస్వామి తెలిపారు. రన్నింగ్ , త్రోస్ , జంప్ ఈవెంట్లలో ప్రతిభ కనబరిచిన అథ్లెట్లను జూలై 15 నుంచి జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఆసక్తి గలవారు ఈనెల 25లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
సరుకు రవాణాలో ఏపీఎస్ఆర్టీసీ జోన్-1 మొదటి స్థానంలో కొనసాగుతుంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. సరుకు రవాణా ద్వారా ఈ జోన్ గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 15వ తేదీ వరకు రూ.4.72 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఏడాది అదే కాలానికి 4.96 కోట్లు ఆర్జించినట్లు విశాఖ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బీ.అప్పలనాయుడు తెలిపారు.
మహిళ దారుణహత్యకు గురైన ఘటన కాకినాడ గ్రామీణ మండలంలో జరిగింది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపేటకు చెందిన ఓలేటి నరసింహమూర్తికి 8ఏళ్ల క్రితం సీత(26)తో పెళ్లైంది. శనివారం రాత్రి అందరూ నిద్రించాక.. కరెంట్ పోయిందని సీత వేరేగదిలో నిద్రించింది. ఉదయంకల్లా హత్యకు గురైంది. భర్త పోలీసులకు ఫిర్యాదుచేశాడు. DSP హనుమంతరావు సిబ్బందితో అక్కడికి వెళ్లారు. భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. ఈక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా దర్శి మండలంలో 9 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేశారు. తుమ్మెదలపాడు, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, రాజంపల్లి, సామంతపూడి, తానంచింతల, బండి వెలిగండ్ల, చందలూరు, త్రిపురసుందరీపురం గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల నుంచి తప్పుకొన్నారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతమైన తుంగభద్ర నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,560 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 812.20 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 35.6294 టీఎంసీలు ఉంది.
పులివెందుల నివాసి యశ్య అనే యువకుడు ఆదివారం సాయంత్రం బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కిందపడి గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సీటీ స్కాన్ నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. యువకుడు పులివెందుల నివాసిగా గుర్తించారు.
పులివెందుల పట్టణ పరిధిలో జగనన్న గృహ నిర్మాణ పథకం కింద దాదాపు 8 వేల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇందులో అక్రమాలు జరిగాయని.. వీటిపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇళ్ల మంజూరులో అప్పటి జాయింట్ కలెక్టర్, పులివెందుల మున్సిపల్ కమిషనర్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
CMగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల తీరును తెలుసుకునేందుకు నేడు రానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. కాగా ప్రాజెక్టు కోసం దాదాపు 30 గ్రామాల్లో 12వేల ఎకరాలు సేకరించారు. 25వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. కాగా ఇప్పటివరకు 200 కుటుంబాలకు మాత్రమే పరిహారం అందిందనేది నిర్వాసితుల మాట. తాజాగా సీఎం ప్రత్యేక దృష్టి సారించటంతో తమకు న్యాయం జరుగుతుందని వారు ధీమాగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.