Andhra Pradesh

News June 17, 2024

ముస్లిం సోదరులకు తిరుపతి కలెక్టర్ సూచనలు

image

తిరుపతి జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు బక్రీద్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మత పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News June 17, 2024

తూ.గో.: ALERT.. నేడు, రేపు పిడుగులతో వర్షం

image

ద్రోణి ప్రభావంతో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ ఆదివారం తెలిపారు. కాగా నేడు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో, రేపు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 17, 2024

అందరిపై అల్లా దయ ఉండాలి: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ ఎం.హరి నారాయణన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దానధర్మాలు, త్యాగాలకు ప్రతీకగా నిలిచే పండగల్లో బక్రీద్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. జిల్లాలోని ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని.. అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

News June 17, 2024

ఎన్టీఆర్: ‘త్యాగం, ప్రేమకు ప్రతీక ముస్లిం సోదరులు’

image

భక్తి భావం, త్యాగం ప్రేమలకు ప్రతి కైన ముస్లిం సోదరులకు కలెక్టర్ ఢిల్లీ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని చేసిన ఈ ప్రకటనలో ముస్లిం సోదరులు ఎల్లప్పుడూ.. సుఖ సంతోషాలతో గడపాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈ పండుగను సాంప్రదాయ పద్ధతిలో విజయవంతం చేయాలని ముస్లిం సోదరులకు చెప్పారు.

News June 16, 2024

గుంటూరు: 17 నుంచి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

image

లాలాపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సహాయ కమిషనర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 17వ తేదీ అంకురారోపణ, 18వ తేదీ మోహిని అలంకారం, 19వ తేదీ దశావతారం, 20వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు. 21న రథోత్సవం, 22న పూర్ణాహుతి, 23న బలిహరణ కార్యక్రమాలు జరుగనున్నట్లు చెప్పారు.

News June 16, 2024

కడప: ఆర్టీసీ బస్సు ఢీకొని.. ఇద్దరు మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన కడప నగర పరిధిలోని అలంఖాన్ పల్లి సర్కిల్ దగ్గర జరిగింది. ఆదివారం రాత్రి కర్నూలు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటర్‌ని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు మరణించారని, ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు. మృతులు బద్వేల్ నివాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 16, 2024

అచ్చెన్నాయుడికి అభినందనలు: చంద్రబాబు

image

TDP రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రఅధ్యక్షుడిగా పార్టీని నడిపంచడంలో అద్భుత పనితీరు కనబరిచారంటూ కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలని చంద్రబాబు ప్రశంసించారు. గత ప్రభుత్వ కాలంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

News June 16, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పల్లా శ్రీనివాసరావు యాదవ్ టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడుగా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

News June 16, 2024

విజయవాడ: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ రామకృష్ణ

image

ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులతో ఆదివారం సీపీ రామకృష్ణ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. నగర వ్యాప్తంగా క్రమం తప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

News June 16, 2024

బద్వేల్ – పొరుమామిళ్ళ రోడ్డులో యాక్సిడెంట్

image

బద్వేల్ – పొరుమామిళ్ళ రోడ్డులో ఇవాళ రాత్రి 7 గంటలకు రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరసింహులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన నరసింహులు బద్వేల్ నివాసిగా గుర్తించారు.