India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా చేజర్ల జడ్పీటీసీ సభ్యుడు పీర్ల పార్థసారథి పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.50 కోట్ల విలువైన 1560 టన్నుల తెల్లరాయిని గనుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతించిన ప్రదేశంలో కాకుండా మరో చోట తవ్వకాలు చేస్తున్న వాహనాలను, తవ్విన ఖనిజాన్ని డీడీ శ్రీనివాస్ సీజ్ చేసి రెవెన్యూ, పోలీస్ విభాగాలకు అప్పగించారు. శ్రీరామ మినరల్స్ పేరుతో అనుమతి పొంది మరోచోట తవ్వకాలు చేసినట్లు సమాచారం.
మహిళలకు మగ్గం వర్క్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలకు ఈనెల 24 నుంచి నుంచి ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు.
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వారి నివాసంలో మంత్రి కందుల దుర్గేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దుర్గేశ్ను గోరంట్ల సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పదవి వచ్చినందుకు గోరంట్ల ఆయనకు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం గోరంట్లను దుర్గేశ్ శాలువాతో సత్కరించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం సాయంత్రం భారీ వర్షాలు కురవగా, ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. ప్రధానంగా పెంటపాడు, తాడేపల్లిగూడెం పోడూరు, ఆచంట, పెనుగొండ తదితర ప్రాంతాలలో ఎండ ధాటికి రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?
ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో హిట్ మ్యాన్ అండ్ ప్రోమోస్ ప్రొడక్షన్ సినిమా యూనిట్ సందడి చేసింది. గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పక్కన ఎంపిక చేసిన రైతు ఇంట్లో ఆదివారం షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ‘ఇంద్రప్రస్థా’ పేరుతో నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, చైతన్య కృష్ణ హీరోలుగా నటిస్తున్నారు.
కాజీపేట సెక్షన్లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.20806, నం.20805 ఏపీ ఎక్స్ప్రెస్లు(AC) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్లు జూన్ 22 నుంచి జులై 5 వరకు విజయవాడ- బల్లార్షా- నాగ్పూర్ మీదుగా కాక విజయనగరం- రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
తన పాలనలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని CM చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ధర్మారెడ్డిని తొలగించి TTD ఈవోగా శ్యామలరావును నియమించారు. సర్వ, దివ్య, బ్రేక్ దర్శన విధానాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. అన్నప్రసాదం, లడ్డూల నాణ్యతపైనా విమర్శలు ఉన్నాయి. నిరంతరం అన్నప్రసాదం అందించాలనీ కోరుతున్నారు. తిరుమలలో ఇంకా ఏమేమీ మార్పులు చేయాలో కామెంట్ చేయండి.
సీఎం చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నరసాపురం పార్లమెంట్లోని కూటమి పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలవరంలో ప్రాజెక్ట్ని సందర్శిస్తారని అన్నారు.
భార్య అలిగి వెళ్లిందని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పీటీఎం మండలం, కందుకూరు పంచాయతీ, అగ్రహారానికి చెందిన శంకర(48)తో భార్య లక్ష్మి గొడవపడి వారం క్రితం అలిగి పుట్టినింటికి వెళ్లింది. తిరిగి కాపురానికి రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన శంకర ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లెకు తరలించారు.
చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నూజివీడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కోసూరి కార్తీక్ (19), మైలవరపు కేదారేశ్వరరావు (19) అలల ధాటికి గల్లంతయ్యారు. మెరైన్ పోలీసుల సాయంతో కేదారేశ్వరరావును కాపాడగలిగారు. కార్తీక్ కోసం గాలిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.