India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెనాలి శాసనసభ్యుడిగా ఎన్నికైన వారిలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అన్నాబత్తుని సత్యనారాయణ కొంతకాలం పౌరసరఫరాల మంత్రిగా పని చేశారు. తిరిగి ఇప్పుడు నాదెండ్ల మనోహర్కు కూడా అదే పౌర సరఫరాల శాఖను సీఎం చంద్రబాబు కేటాయించారు. తెనాలి నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాదెండ్లను పలువురు పట్టణ ప్రముఖులు కలిసి అభినందనలు తెలుపుతున్నారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు తెలిపాయి. రిజల్ట్స్ కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
మార్కెట్లో లభ్యమయ్యే నాణ్యమైన మొదటి రకం టమాటా ధర సెంచరీకి దగ్గరైంది. జిల్లాలోని దాదపు అన్ని మండల కేంద్రాల్లో తృతీయ శ్రేణి టమాటాలు కిలో రూ.60 పైగానే వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కేజీ ఉల్లిగడ్డ రూ.60 పలుకుతోంది. నిత్యం వాడే కురగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఖర్చుల భారం పెరిగిపోతుందని ప్రజలు వాపోతున్నారు. ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
హిందూపురం ఆర్టీసీ డిపో బస్సుకు అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు రాంగ్ రూట్లో వెళ్లి రివర్స్ తీసుకుంటుండగా డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి బస్సు వాలింది. ప్రయాణికుల కేకలు వేసి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో సుమారు 40మంది దాకా ప్రయాణికులు ఉన్నారు.
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని శ్రీశైలం డ్యాం సమీపంలో శనివారం చిరుత పులి మృతిచెందింది. దోమలపెంట రేంజర్ గురుప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువుల దాడిలో ఓ మగ చిరుత పులి మృతిచెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ మంత్రిగా కేబినెట్లో స్థానం లభించడంతో మండలంలోని మక్కెన వారి పాలెం ఎస్సీ కాలనీలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడప జడ్పీ ఛైర్మన్గా శారద శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఉన్న జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. దీంతో వైస్ ఛైర్మన్గా ఉన్న శారద పూర్తి స్థాయిలో జడ్పీ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రగతికి చేయూతనిస్తానని ఆమె అన్నారు.
పార్వతీపురం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల కోసం కొత్తగా రెండు అదనపు బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ డీఎం కనకదుర్గ తెలిపారు. ఇప్పటివరకు పార్వతీపురం నుంచి విజయవాడకు మూడు అల్ట్రా డీలక్స్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రస్తుతం దుత్తలూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడువుతీరిన చిన్నారుల మెచ్చే వివిధ రకాల చిరుతిళ్ల ప్యాకెట్లు హల్చల్ చేస్తున్నాయి. కంపెనీ 50 శాతం అదనంగా ఇస్తామంటూ ఆఫర్లను పెట్టి గడువు తీరిన వివిధ రకాల ప్యాకెట్లను మార్కెట్లోని అందుబాటులోకి తెచ్చి విక్రయ దారులకు తగినంత కమిషన్ ఇచ్చి తమ మార్కెట్ పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇవేమీ ఆలోచించకుండా ఈ ప్యాకెట్లు చిన్నారులకు అందజేస్తున్నారు.
భావితరాలకు గుర్తుండిపోయేలా రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రణస్థలంలోని ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి రామోజీ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు కలిశెట్టి సన్నద్ధం చేశారు.
Sorry, no posts matched your criteria.