Andhra Pradesh

News March 22, 2025

ఏప్రిల్ 5 నుంచి రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు

image

ఏప్రిల్ 5 నుంచి 6 వరకు కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి తెలిపారు. శనివారం నగరంలోరాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించి బ్రోచర్‌ను పలువురు ఆవిష్కరించారు

News March 22, 2025

శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News March 22, 2025

కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 22, 2025

VZM: జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తి

image

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా SP వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.

News March 22, 2025

యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందాం: కలెక్టర్

image

యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని సచివాలయంలో నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఎక్కడన్నా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. 

News March 22, 2025

విశాఖ: కళాకారులకు జిల్లాస్థాయి అవార్డులు

image

విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులను ఆదివారం కళా ప్రవీణ 2025 పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కే జనార్ధన్ పేర్కొన్నారు. శనివారం వారు మహారానిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా నుంచి గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి స్థానిక కళ్యాణ మండపంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

News March 22, 2025

కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 22, 2025

గుంటూరు జిల్లాలో ఉగాది పురస్కారాలు వీరికే..

image

గుంటూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేయనుంది. వారిలో తాడేపల్లి సిఐడి అడిషనల్ ఎస్పీ జయరామరాజు మహోన్నత సేవా పతాకం అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ సేవా పురస్కారానికి హెడ్ కానిస్టేబుల్ పిచ్చయ్య, APSP 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, ARSI ఉదయ కుమార్, PCలు శివప్రసాద్, విరుపాక్ష ఎంపికయ్యారు. తెనాలి ఎస్ఐ శ్రీనివాసరావుకు సేవా పురస్కారం వరించింది.

News March 22, 2025

రాజానగరం: సేద్యపు నీటి కుంటను ప్రారంభించిన కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS)ద్వారా సేద్యపు నీటి కుంటను జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి కొబ్బరికాయ కొట్టి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తోకాడ గ్రామం నుంచే మొట్టమొదటిగా ఇంకుడు గుంట కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులైన నీటిని ఒడిసిపెట్టి, దాచి నట్లయితే రాబోయే తరాలవారికి మంచి తాగునీటిని అందించగలమని అన్నారు.

News March 22, 2025

GNT: సీఎంవోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

సీఎంవోలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీఎంవోలో పనిచేయడానికి ఫోటోగ్రాఫర్లు-3, వీడియోగ్రాఫర్లు-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరికి నెలకు రూ.70,000 వేతనం చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.