India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిందూపురం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులు మంజుల, కానిస్టేబుల్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. టూటౌన్ స్టేషన్లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సహకారంతో మోడల్ కాలనీలో మంజుల వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. ఈశ్వర్ అనే వ్యక్తి పారిపోయాడు. మంజుల, కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు.
మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోరీకేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని గుంటూరు జిల్లా జైలు నుంచి తీసుకెళ్ళి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు కొత్తపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాలికపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం చేశాడన్న కేసులో నేరం రుజువు కావడంతో వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానాను జిల్లా పొక్సో కోర్టు స్పెషల్ జడ్జి సిరిపిరెడ్డి సుమ విధించారు. వింజమూరు మండలానికి చెందిన బాలిక 2013 మే 6న కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా.. కృష్ణ అనే వ్యక్తి లైగింక దాడికి పాల్పడగా..వ్యతిరేకించడంతో బావిలోకి తోసేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా శిక్ష పడింది.
బీకే కళావతి అనే మహిళ 65 ఏళ్ల వయస్సులో శ్రీకాకుళంలోని ప్రైవేట్ న్యాయ కళాశాలలో ఐదేళ్ల L.L.B చదువుతున్నారు. ప్రస్తుతం ఈమె ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో LLB మూడో సెమిస్టర్ పరీక్ష రాస్తున్నారు. ఈమెది తమిళనాడు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు మేరకు దేశంలో ఎక్కడైనా న్యాయ విద్య చదివే అవకాశం ఉంది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు మధ్యాహ్నం తన కల్లంలో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి అక్కడికొచ్చి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రాగానే.. అతడు పరారయ్యాడు. పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు నిఘా పెంచారు. టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్లతో బెట్టింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని సీపీ శంఖబ్రత భాగ్చీ ఆదేశాలు జారి చేశారు. బెట్టింగ్ యాప్ ద్వారా గానీ మరే ఇతర విధంగా గాని బెట్టింగ్లకు పాల్పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నేటి నుంచి జరగనున్న IPL క్రికెట్ సందర్భంగా బెట్టింగ్ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఎస్పీ భావన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లపై ప్రత్యేక నిఘా ఉందని, గతంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన వారిని ఇప్పటికే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. పదే పదే బెట్టింగ్ నిర్వహిస్తే జిల్లా బహిష్కరణ ఉంటుందన్నారు.
వివాహం కావడం లేదని మనస్తాపం చెంది హుకుంపేట D-బ్లాక్కు చెందిన ఉరిటి రామ సుబ్రహ్మణ్యం (45) ఇంటిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తల్లి వెంకటలక్ష్మి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం రాజమండ్రిలోని ఒక ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.
చిత్తూరు జిల్లాలో ఓ ఎస్ఐ ఒకరి ప్రాణం కాపాడారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన ఓ వ్యక్తి లోన్ తీసివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత తీసిస్తానని ఆమె చెప్పింది. ‘నేనంటే నీకు ఇష్టం లేదు. నేను చనిపోతున్నా అమ్మ’ అంటూ అతను తల్లికి వీడియో పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈశ్వర్ యాదవ్ టెక్నాలజీ ఉపయోగించారు. మందు తాగి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించి ప్రాణాలు కాపాడారు.
క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులు, పందెపు రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.
Sorry, no posts matched your criteria.