Andhra Pradesh

News October 3, 2024

VZM: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

భోగాపురం పోలీస్ స్టేషన్ లో 2021లో నమోదైన హత్య కేసు నిందితుడికి జిల్లా మహిళ కోర్టు జీవిత ఖైదు, రూ. 2,500 జరిమానా విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కొంగవానిపాలెంకు చెందిన గోవింద మద్యం మత్తులో భార్య మంగమ్మను హత్య చేశాడని, మృతిరాలి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామన్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారైందని చెప్పారు.

News October 3, 2024

తిరుపతి: సీఎం పర్యటన సందర్భంగా కాన్వాయ్ రిహార్సల్స్

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట నుంచి తిరుమల వరకు కాన్వాయ్ ట్రైల్ రన్ ను ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ ఇంటిలిజెన్స్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. విమానాశ్రయంలో వాహన శ్రేణి పోలీస్ అధికారులు, డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు.

News October 3, 2024

100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని 30 నాటికి సాధించాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు సంబంధించి జిల్లా, మండల కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో వంద రోజులు ప్రణాళికపై, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సరించాలన్నారు.

News October 3, 2024

ప.గో.జిల్లాలో వైసీపీ కనుమరుగైంది: మేకా శేషుబాబు

image

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కనుమరుగైందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. గురువారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కనుమరుగవడానికి కారణం కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే గౌడలకు 10శాతం మద్యం షాపులు కేటాయించడం శుభ పరిణామన్నారు.

News October 3, 2024

తిరువూరు: శావల దేవదత్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్‌కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

News October 3, 2024

ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీఓలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దినసరి సరాసరి కూలి వేతన చెల్లింపులో దిగువ స్థానంలో ఉన్నామని వేతన కూలి రేటు పెంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు.

News October 3, 2024

సైబర్ నేరాల కట్టడికి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి: ఎస్పీ

image

కర్నూలులోని ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ జీ.బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొరియర్ అని, లాటరీ తగిలిందని, డిజిటల్ అరెస్టు పేరుతో విడియో కాల్స్ చేస్తూ మోసాలు చేస్తున్నాయని, జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

News October 3, 2024

నవరాత్రులు పూర్తి అయ్యేవరకు 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో నవరాత్రులు పూర్తి అయ్యేవరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. నవరాత్రులు పూర్తి అయ్యేవరకు జిల్లాలో డీజేలు, డాన్సులు, బాణసంచా కాల్చడం, ఊరేగింపులు పూర్తిగా నిషేధం విధించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, ఎవరు అతిక్రమించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 3, 2024

VJA: ముంబై నటి కేసులో కీలక అప్డేట్

image

ముంబై నటి జెత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పొడిగింపు చేసింది. ఇవే ఆదేశాలు కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ, సీఐలకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.

News October 3, 2024

పెండ్లిమర్రి: పిడుగు పడి ముగ్గురు మృతి

image

పెండ్లిమర్రి మండలంలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మండలంలోని తుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటు గురై ఓ మహిళ, ఓ అబ్బాయి మరణించారు. అలాగే పగడాలపల్లికి చెందిన మరో యువకుడు ఇసుక తోలుకోవడానికి వెళ్లి మరణించారు. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.