India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పలు పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తున్న కారణంగానే జిల్లాలో రక్తహీనత తగ్గిందని జిల్లాలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం అభిప్రాయపడింది. కలెక్టర్ అంబేడ్కర్ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత గుర్తించిన అంశాలను కలెక్టర్కు వివరించారు.
జివిఎంసి స్థాయి సంఘం సమావేశం శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశంలో 104 అంశాలు పొందుపరిచారు. వాటిలో ఒక అంశాన్ని వాయిదా వేశారు. 2 అంశాలను సభ్యులు తిరష్కరించారు. మిగిలిన 101 అంశాలు ఆమోదం పొందాయి. సమావేశంలో కార్యదర్శి బి.వి.రమణ, జోనల్ కమిషనర్లు ప్రేమ ప్రసన్నవాణి ,శివప్రసాద్, మల్లయ్య నాయుడు, బి.రాము ఉన్నారు.
జిల్లాకు ప్రధానమైన తోటపల్లి కుడి ప్రధాన కాల్వ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎంను కోరనున్నట్టు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తిచేసేందుకు ఏమేరకు నిధులు అవసరమవుతాయో నివేదిక ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో యాప్లోని SOS బటన్ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం తామున్న ప్లేస్కి చేరుకొని రక్షిస్తుందన్నారు.
సుప్రింకోర్ట్ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం కేంద్రాలు ప్రవేశ పెట్టాలని తీర్మానించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ది తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కభర్ది హాజరై మాట్లాడారు.
గుంటూరు నగరంలో త్వరలో మోడల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నగర పాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ షేక్ సజీల తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవితో కలిసి బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడిపేట 4వ లైన్ 14 వ అడ్డరోడ్డులో ఫుడ్ కోర్ట్ ఉగాది లేదా శ్రీరామ నవమి నాటికిప్రారంభిస్తామన్నారు
ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, సతీమణి షహనాజ్, మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలకు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులతో మాట్లాడారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్షించాలని, జిల్లాలో 10,748 వేల మంది పిల్లలు ఆధార్ నమోదు కాలేదని సత్వరమే ఆధార్ నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు
చిత్తూరు నగరంలోని పలు మెడికల్ షాపులను గరుడ బృందం శుక్రవారం తనిఖీ చేసింది. నిషేధిత మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దుకు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ ప్రతిపాదనలు పంపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ ఎస్ఐ అనిల్, వెంకట రవి పాల్గొన్నారు.
విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.6లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన మల్లిపాటి సూర్యనారాయణ, పైల సూరిబాబు, కొట్యాడ సూర్యప్రభ కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున రూ.6లక్షలు అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 24 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించామన్నారు.
Sorry, no posts matched your criteria.