Andhra Pradesh

News March 22, 2025

రాజమండ్రిలలో P4పాలసీ కార్యక్రమం

image

P4 పాలసీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. P4 పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

News March 21, 2025

పలమనేరు: నూతన అధ్యక్షుడిగా శ్యాం ప్రసాద్ రెడ్డి

image

పలమనేరు రెవెన్యూ డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సోమల తహశీల్దార్ శాంప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు. పలమనేరులో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డివిజనల్ గౌరవ అధ్యక్షుడిగా మాధవ రాజు, ఉపాధ్యక్షుడిగా యోగానంద్, మోహన్ రెడ్డి, తహసీన, జనరల్ సెక్రటరీగా అనిల్ కుమార్, మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

News March 21, 2025

నెలాఖరులోగా మంజూరును పూర్తి చేయాలి: కలెక్టర్

image

బ్యాంకుల‌కు కేటాయించిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాల‌ను మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ కోరారు. జిల్లా స్థాయి బ్యాంక‌ర్ల స‌మీక్షా క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌తిబ్యాంకుకు ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాలు మంజూరు చేసి, గ్రౌండింగ్ అయ్యేలా చూడాల‌ని ఆదేశించారు. విశ్వకర్మపై దృష్టి సారించాలన్నారు.

News March 21, 2025

విశాఖ అధికారులతో జూమ్ కాన్ఫిరెన్స్

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి.డి.సర్వే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతా, శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీల టీ.టీ-1, టీ-టీ-2 డోసులు, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. DMHO జగదేశ్వరరావు ఉన్నారు.

News March 21, 2025

మచిలీపట్నం: చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య

image

మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 21, 2025

VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

image

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.

News March 21, 2025

కృష్ణా: ‘రెడ్ బుక్‌తో ఏం చేయలేరు’ 

image

వైసీపీ నేతల అరెస్ట్‌లతో జగన్ పరపతి ఎక్కడా తగ్గదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏం చేయలేరని, 6 గ్యారంటీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోసానిపై 18 కేసులు పెట్టేందుకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. 

News March 21, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్➤ నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు➤ ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా➤ మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం➤ కర్నూలులో TDP నేత దారుణ హత్య.. ఎస్పీ వివరాల వెల్లడి ➤ కర్నూలులో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు➤ మంత్రాలయం: పల్లెల్లో దాహం కేకలు..!➤ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

News March 21, 2025

జీవీఎంసీకి పన్ను చెల్లించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జీవీఎంసీకి ఈ ఏడాది పన్నును చెల్లించింది. మార్చి 31వ తేదీకి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో శుక్రవారం జీవీఎంసీ గాజువాక జోన్ అధికారులకు పన్ను మొత్తం రూ.3,41,47,156 స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ, ఆర్‌ఐ శివకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు శుక్రవారం చెక్కు అందజేశారు.

News March 21, 2025

రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

image

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.