Andhra Pradesh

News March 21, 2025

మంగళగిరి: సీసీటీవీల పురోగతిపై హోంమంత్రి సమీక్ష 

image

మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీశ్ గుప్తాతో పాటు జిల్లాల ఎస్సీలతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో పురోగతి, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసుల్లో ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించేందుకు తగిన ఆదేశాలు ఇచ్చారు. 

News March 21, 2025

సేవా పతకాలకు చిత్తూరు పోలీసులు ఎంపిక

image

ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పోలీసులకు పతకాలు వచ్చాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, మనోహర్, మునిరత్నం, దేవరాజుల నాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, నాంతుల్లా, బాలాజీ, హరిబాబు, మణిగండన్‌కు పథకాలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

News March 21, 2025

మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్

image

నెలాఖరులోపు మినీ గోకులాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కి వివరించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఫార్మ్ ఫండ్ ఏర్పాట్లు, సీసీ రోడ్ల నిర్మాణాల పురోగతి, గోకులంల నిర్మాణాల పురోగతిపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1200 లక్ష్యానికి 664 పూర్తి చేసామని కలెక్టర్ వివరించారు.

News March 21, 2025

ఓవర్ హీట్: విశాఖ జూలో ఉపసమన చర్యలు

image

వేసవి ఉష్ణోగ్రతలు మండుతున్న నేపథ్యంలో జూలో వన్యప్రాణులు ఎండ వేడిమి తిట్టించుకునేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చింపాంజీలు, టైగర్స్, లయన్, జీబ్రా, జిరాఫీలు, ఎలిఫెంట్స్, వివిధ రకాల పక్షులు మొదలైన వాటికి ఎండవేడిమి తట్టుకునేలా, వాటర్ స్ప్రింకలర్స్ ఏర్పాటు చేశారు. లోపల ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లు, కస్ కస్ మ్యాట్లు, తాటాకు పందిర్లు పెట్టారు. వేడి నుంచి ఉపశమనం కలిగేందుకు ఇవి దోహదపడుతున్నాయి.

News March 21, 2025

ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా

image

2025-2026 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా వేసినట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు ఏప్రిల్ 13న 5వ తరగతికి ఉదయం 9-12 గంటల వరకు, ఇంటర్మీడియట్ మధ్యాహ్నం 2 -4:30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు.

News March 21, 2025

గార: నదిలో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృత దేహం

image

గార మండలం కళింగపట్నం సమీపంలో వంశధార నదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2025

మచిలీపట్నం: సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ 

image

దేశ శాంతిభద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకోగా శుక్రవారం ఉదయం జడ్పీ కన్వెన్షన్ నుంచి ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణతో కలిసి కొంతదూరం సైకిల్ ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. 

News March 21, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. కోర్టు దర్యాప్తు అధికారిణి హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణలో అధికారిపై వివరాలు కోరనుంది. 

News March 21, 2025

సీఐఎస్ఎఫ్ చూపుతున్న దేశభక్తి ప్రశంసనీయం: కలెక్టర్

image

ర్యాలీలో పాల్గొన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందిస్తూ వారు చూపుతున్న దేశభక్తి, అంకితభావం ప్రశంసనీయమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీఐఎస్ఎఫ్ దేశం నలుమూలల అంతర్గత పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ముందడుగు వేయడానికి వీలుందన్నారు. ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలనే ఉద్దేశంతో సీఐఎస్ఎఫ్ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. 

News March 21, 2025

ప.గో జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపికైన అధికారులు

image

పశ్చిమగోదావరి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ HC అప్పారావు, DAR ARPC వెంకట రామకృష్ణ, పాలకొల్లు ఫైర్ ADFO జానకిరామ్, తణుకు టౌన్ PS HC నరసింహారాజు, జిల్లా ARSI నాగేశ్వరరావు. కొవ్వూరు డివిజన్ లోని ఉండ్రాజవరం PS ASI రామకృష్ణ, చాగల్లు PS ASI రాజేంద్రప్రసాద్‌లు ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని అధికారులు తెలిపారు.