Andhra Pradesh

News March 21, 2025

విశాఖలో ఆశీల వసూళ్లకు బహిరంగ వేలం

image

జీవీఎంసీ జోన్ -3 పరిధిలో 2025-26 సంవత్సరానిగాను పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోన్-3వ జోనల్ కమిషనర్ శివప్రసాద్ గురువారం తెలిపారు. జోన్-3లో మార్కెట్లు, లుంబిని పార్క్ ప్రవేశానికి, పార్కింగ్ టికెట్ వసూలు చేసేందుకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆశీలుమెట్ట జీవీఎంసీ జోన్ -3 జోనల్ కార్యాలయంలోని హాజరు కావాలన్నారు.

News March 21, 2025

గుంటూరులో ఉత్సాహంగా మహిళల ఆటల పోటీలు

image

పని ఒత్తిడి నుంచి విముక్తికి క్రీడలు దోహదపడతాయని CPDCL ప్రాజెక్ట్స్ డైరెక్టర్ KL.మూర్తి అన్నారు. ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ (విజయవాడ) సర్కిల్ ఉమెన్స్ గేమ్స్, కల్చరల్ కాంపిటీషన్స్‌ని గురువారం గుంటూరులో పరిశీలించారు. చెస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. గుంటూరు జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ కేవీఎల్ఎన్ మూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

News March 21, 2025

కృష్ణా: ‘అర్హులకు లబ్ధి చేకూర్చాలి’

image

అర్హులకు ప్రభుత్వ లబ్ధిచేకూరేలా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ అన్నారు. జిల్లాల్లో పాలనా వ్యవహారాలు పరిశీలించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లను నియమించిన సంగతి తెలిసిందే. జిల్లాకు నియమితులైన మనజీర్ జిలానీ గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు స్వాగతం పలికారు.

News March 21, 2025

SKLM: నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

image

ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం మార్చి 21న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 21, 2025

14400కు కాల్ చేయండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో సారా నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో నవోదయం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సారా తయారీ చేసినా, విక్రయించినట్లు తెలిసినా ప్రజలు 14400 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ మణికంఠ, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు.

News March 21, 2025

VZM: ఇళ్ల లబ్దిదారులకు ఉచితంగా ఇసుక: కలెక్టర్

image

ఇళ్ల లబ్దిదారులకు ప్ర‌భుత్వం అందిస్తున్న అద‌న‌పు సాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కలెక్ట‌ర్ అంబేడ్కర్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. అద‌నంగా ఆర్ధిక సాయం చేయ‌డ‌మే కాకుండా, ఇసుక‌ను కూడా ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తోందన్నారు. ల‌బ్దిదారులు వీటిని వినియోగించుకొని స‌కాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం ఇళ్ల నిర్మాణానికి అనుకూల‌మైన స‌మ‌య‌మ‌ని చెప్పారు.

News March 21, 2025

పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా చూడండి: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా, అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీసి రుణాల మంజూరు అంశాలను కలెక్టర్‌కు వివరించారు.

News March 21, 2025

CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

image

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

News March 21, 2025

‘లబ్ధిదారులకు అదనపు సహాయం రూ.6.19 కోట్లు విడుదల’

image

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం కింద 4,240 మంది లబ్ధిదారులకు రూ.6.19 కోట్ల నిధులను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం తెలిపారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఎఫ్‌టీఓ విడుదల చేసిన లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు.

News March 21, 2025

‘తాగు నీటి సమస్యకు పర్యవేక్షక సెల్ ఏర్పాటు’

image

గ్రామీణ ప్రాంత ప్రజలు వేసవిలో తాగునీటి కొరత సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటకు రాజమహేంద్రవరం జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారి కార్యాలయంలో పర్యవేక్షక సెల్‌ ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారి బి.వెంకటగిరి ప్రకటనలో తెలిపారు. తాగునీటి సమస్యలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు 91001 21190 నంబరుకు తెలియజేయాలన్నారు.