Andhra Pradesh

News September 24, 2025

చందమామ కథలను ప్రారంభించింది మన తెనాలి వారే

image

తెలుగు రచయిత, ‘చందమామ’ పుస్తక సంపాదకుడు, చందమామ-విజయా కంబైన్స్ సహా నిర్మాత ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) తెనాలిలో జన్మించారు. ఆయన రచయితగా, అనువాదకుడిగా పేరు పొందడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాలే కాక ఆయన నాగిరెడ్డితో కలసి 1947 జులైలో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఒక్కసారైనా చదివే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.

News September 24, 2025

సినిమా పైరసీలో నెల్లూరు జిల్లా యువకుడి ప్రమేయం..?

image

సినిమా పైరసీ వ్యవహారం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. సీతారాంపురం మండలానికి చెందిన ఓ యువకుడు సినమా పైరసీ చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీతారాంపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి సదరు యువకుడికి హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. సీతారాంపురం యువకుడితో పాటు మరికొందరు పాత్ర పైరసీ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది.

News September 24, 2025

GNT: ఆ రోజుల్లోనే ఓ పాఠశాల పత్రిక నడిపారు

image

ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు, భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (CPM) పాలిట్‌బ్యూరో సభ్యుడు కొరటాల సత్యనారాయణ (సెప్టెంబరు 24, 1923 – జులై 1, 2006) ఉమ్మడి గుంటూరు జిల్లా ప్యాపర్రులో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమం, గుంటూరులో పోలీసుల కాల్పులు, విద్యార్థుల మరణం ఉద్యమ స్ఫూర్తిని పెంచాయి. 1942లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు. ఆ రోజుల్లోనే ఓ పాఠశాల పత్రిక కూడా నడిపారు

News September 24, 2025

24 నెలల్లో అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ..?

image

అమరావతి ప్రాంతంలో 24 నెలల్లో రూ.150 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి లోకేశ్ ఇందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీలో చెప్పారు. లైబ్రరీ అభివృద్ధికి శోభా డెవలపర్స్ రూ.100 కోట్లు హామీ ఇచ్చారని, మంగళగిరిలో ఏకంగా అక్టోబర్‌లో మోడల్ లైబ్రరీ ప్రారంభించనున్నట్లు సమాచారం. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ & భౌతిక లైబ్రరీలలో అవసరమైన అన్ని పుస్తకాలు లభిస్తాయి.

News September 24, 2025

మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్

image

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవసరమైన మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. 2023 – 24, 2025 – 2026 సంవత్సరాల్లో 1,550 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, 915 పూర్తి చేయడం జరిగిందని, 103 నిర్మాణాల్లో ఉన్నాయని, ఇంకా 532 ఇంకా ప్రారంభించాల్సి ఉందన్నారు.

News September 24, 2025

SKLM: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

image

వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండటంతో రానున్న 4 రోజులు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు విస్తాయన్నారు. 08942-240557ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News September 24, 2025

భీమవరంలో మిస్సింగ్.. గుంటూరులో ప్రత్యక్షం

image

భీమవరానికి చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి పారిపోవడంతో పోలీసులు గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. భవాని దీక్షకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అందిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. బాలుడు అమరావతిలోని మేనమామ ఇంటికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానంతో గుంటూరు రైల్వే చైల్డ్ కేర్‌కు సమాచారం ఇచ్చారు. వారు బాలుడిని గుంటూరులో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News September 24, 2025

కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు

image

కడప కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేశారని MLA మాధవి రెడ్డి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణ తర్వాత మేయర్‌‌‌‌ పదవి నుంచి ఆయనను తప్పించారు. దీనిపై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లగా మరోసారి ఆయన వాదనలు వినాలని సూచించింది. ఈనెల 17న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి సురేశ్ బాబు తన వాదన వినిపించారు. సంతృప్తి చెందని అధికారి మేయర్‌పై అనర్హత వేటు వేశారు.

News September 24, 2025

VZM: ఆర్టీసీలో అప్రెంటీస్‌‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోలు, యూనిట్‌లలో షీట్ మెటల్ వర్కర్ & పెయింటర్ ట్రేడ్‌లలో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. www.apprenticeship.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News September 24, 2025

SKLM: RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు

image

ITI పాస్ అయిన అభ్యర్థులు RTCలో అప్రెంటిస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25లోగా డీజిల్, మెకానికల్, ట్రేడ్లలో ఉత్తీర్ణులైన వారు https://www.apprenticeshipindia.gov.on వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 10న విజయనగరం RTC ట్రైనింగ్ సెంటర్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.