Andhra Pradesh

News March 20, 2025

స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వెనుకబడిన తరగతుల వర్గాల నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. బీసీ-ఎ,బీ,డీ,ఈ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు *https://apobmms.apcfss.in* ద్వారా ఆన్‌లైన్లో మార్చి 22వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 20, 2025

మంత్రివ‌ర్గ ఉప సంఘం భేటీలో నెల్లూరు మంత్రులు

image

అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, పొంగూరు నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా మంత్రి వ‌ర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చ‌ర్చ సాగింది.

News March 20, 2025

ఒంగోలు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి.!

image

RTC బస్సులో మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులో నివాసం ఉంటున్న సాహినా బేగం హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో ఒంగోలు వస్తోంది. సంతమాగులూరు వద్దకు వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబ సభ్యులు, ప్రయాణికులు గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు.

News March 20, 2025

రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదు: జేసీ

image

రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులను అందచేయాలని జేసీ రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడారు. 13 గ్రామాలలో రైతులకు 9(2) నోటీసులను అందజేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు.

News March 19, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤హత్తిబెళగల్ వీఆర్వోపై కర్నూలు జేసీ నవ్య ఆగ్రహం ➤ కూటమి ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే ఫైర్ ➤ జగన్, కేసీఆర్ తోడు దొంగలు, ఆర్థిక నేరగాళ్లు: బైరెడ్డి ➤ లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..! ➤ కోడుమూరు: వైసీపీ నాయకుడి మృతి ➤ ప్రజల మనసులో నుంచి వైఎస్ఆర్‌ను తొలగించలేరు: ఎస్వీ ➤ ప్రభుత్వాసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందించాలి: ఆదోని ఎమ్మెల్యే

News March 19, 2025

కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

image

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.

News March 19, 2025

విశాఖ స్టేడియం ఆవరణలో నిరసన చేస్తాం: గుడివాడ

image

మధురవాడలో గల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు వైయస్సార్ పేరు తొలగించడం అన్యాయమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. విశాఖలో వైసీపీ ఆఫీసులో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ స్టేడియంకు YSR పేరును తొలగించడం పట్ల నిరసనగా స్టేడియం ఆవరణలో వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.

News March 19, 2025

కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

image

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.

News March 19, 2025

టాటా ఇన్నోవేషన్ సెంటర్‌కు భూ సేకరణ: అనంత కలెక్టర్

image

రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద ఉన్న భూమి, సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిన్ బిల్డింగ్‌ను ఆయన పరిశీలించారు. 24గంటల్లో స్థల పరిశీలన చేయాలని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, సర్వే AD, MROలను కలెక్టర్ ఆదేశించారు.

News March 19, 2025

గుంటూరు: వక్కపొడి సంస్థ కార్యాలయాలపై దాడులు 

image

గుంటూరులోని ఓ ప్రముఖ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఐటీ దాడులు కొనసాగాయి. గుంటూరులోని ఆ సంస్థ ఛైర్మన్ నివాసంలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో 40కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ.18లక్షల నగదు సీజ్ చేసినట్టు సమాచారం. వక్కపొడి ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.