India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ సాధికారత సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. MSME రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. MSMEలు రాష్ట్రంలో ఉపాధి పెంపుదల,ఆర్థిక వృద్ధికి మూలస్తంభాలన్నారు. కేంద్ర ప్రభుత్వ Viksit Bharat 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నామన్నారు.
ఒంగోలు గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు నెల రోజులపాటు టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నెల రోజులపాటు ఉండే శిక్షణలో భోజనం, వసతి పూర్తిగా ఉచితమన్నారు. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు ఒంగోలు గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి రావాలన్నారు.
విశాఖనగరంలో ఎండలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే ఎక్కడ వడదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. మనిషి నిరసించి పడిపోతే వెంటనే నీరు అవసరం. గతంలో జీవీఎంసీ సహా పలు స్వచ్ఛందసంస్థలు ప్రతివార్డులో చలివేంద్రాల్లో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసేవి. ఇప్పుడు ఆరిలోవ నుంచి మద్దిలపాలెం వరకు ఎక్కడ చుసిన ఒక్క చలివేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.
కొల్లిపరలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్న తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొల్లిపర పాఠశాలను సెన్సిటివ్ జాబితాలో ఎందుకు చేర్చారని అధికారులను ప్రశ్నించారు.
జీవీఎంసీ బడ్జెట్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కోరినట్లు విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి బుధవారం తెలిపారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి అందజేశామన్నారు. అయితే అసెంబ్లీ మార్చి 22, 29 తేదీల్లో శాసనసభకు, పార్లమెంటుకు సెలవు ఉంటుందని ఆరోజు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను DEO తిరుమల చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 28,020 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 27,891 మంది హాజరైనట్లు వెల్లడించారు. 129 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఎక్కడా జరగలేదన్నారు. ప్రయివేటు విద్యార్థులు 14 మంది గైర్హాజరయ్యారన్నారు.
మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్పై బుధవారం తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి త్వరలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామన్నారు.
చిత్తూరు నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లా అంతట పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను ఏర్పాటు చేశామన్నారు.
వైసీపీ MLC మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందజేశారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్ పెట్టిన ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి సైతం హాజరు కాలేదు. విడదల రజనీకి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడమూ ఇందుకు ఓ కారణం. పల్నాడులో కీలక నేతను కోల్పోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
YCPకి MLC మర్రి రాజశేఖర్ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.