Andhra Pradesh

News October 3, 2024

ఈనెల 4న కలెక్టరేట్ ముందు ధర్నా

image

టీడీపీ కూటమి ప్రభుత్వ హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని కోరుతూ 4న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఎం నగర నాయకులు అబ్దుల్ దేశాయ్, ఎస్ఎండీ షరీఫ్ కాజా పాషా పిలుపునిచ్చారు. కర్నూలు గడియారం హాస్పిటల్ వద్ద కార్మికులతో వారు మాట్లాడారు. తాము అధికారంలో వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

News October 3, 2024

కారంపూడి: ‘ప్రియుడి మోజులో భర్తను హత్య చేసింది’

image

కారంపూడి మండలం పేట సన్నగండ్ల పరిధిలోని తండాలో బుధవారం దారుణ ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తండాకు చెందిన హనీమి బాయ్ భర్త గోపి నాయక్‌ను హత్య చేసిందన్నారు. ప్రియుడి మోజులో పడి భర్తను హత్యచేసిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌లో గడ్డి మందు కలిపినట్లు పిల్లలు చెబుతున్నారని తెలిపారు. దీంతో గోపినాయక్ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

News October 3, 2024

ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్

image

ఏయూలో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డి.ఏ నాయుడు ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధిలో నటన, దర్శకత్వం, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, తాళ వాయిద్యం కోర్సుల్లో, ఆరు నెలలకు యోగా, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, ఫొటోగ్రఫీ, స్పానిష్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోగా దరఖాస్తు చేయాలి, 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. >Share it

News October 3, 2024

కుప్పంలో గ్రానైట్ అక్రమ రవాణా..?

image

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గ్రానైట్ అక్రమ రవాణా జోరుగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి. కుప్పం నుంచి గ్రామీణ రహదారుల్లో వ్యాపారులు నిత్యం తమిళనాడుకు అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా గ్రానైట్ లారీలు సరిహద్దులు దాటుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కుప్పం(M) పైపాళ్యం మీదుగా తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీని పై ఫొటోలో చూడవచ్చు.

News October 3, 2024

కడప: భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు జిల్లా పోలీసులు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా బాధితులకు మొబైల్స్‌ను అందజేశారు. దాదాపు రూ.1.8 కోట్ల విలువగల 555 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ ప్రత్యేక డ్రైవ్ లో సైబర్ క్రైమ్ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న మొబైల్స్‌ను కనుగొన్నారు.

News October 3, 2024

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: డీఈవో

image

తిరుపతి జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో శేఖర్ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

News October 3, 2024

చండీ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి

image

నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం అమ్మవారు శ్రీచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

News October 3, 2024

రాజోలు: రోడ్డు ప్రమాదంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ మృతి

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో వెలంకాయల కాలవగట్టు ప్రాంతానికి చెందిన సుజాత కేశదాసుపాలెం హైస్కూల్లో హెడ్ మాస్టర్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఆమె స్కూటీపై వెళ్తూండగా గొయ్యిని తప్పించే ప్రయత్నంలో పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. కాకినాడ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

News October 3, 2024

చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి

image

చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.

News October 3, 2024

నంద్యాల జిల్లాలో హత్య.. అనుమానమే కారణం!

image

కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో హత్య జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు.. భార్య పార్వతిని భర్త రామమోహన్ గొడ్డలితో నరికి చంపాడు. వీరికి వివాహమై 16ఏళ్లు కాగా కొద్దిరోజులుగా భర్త భార్యకు దూరంగా ఉన్నాడు. ఇటీవల మళ్లీ ఆమె వద్దకు వచ్చిన ఆయన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడేవారు. ఇవాళ తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.