India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు ఆహ్లాదాన్ని ఇచ్చే దిశగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో 173మంది ఎమ్మెల్యేలు, 31మంది క్రికెట్, 25 మంది బ్యాట్మెంటిన్ వాలీబాల్ ఆడనున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.
వరికుంటపాడులో 84 ఏళ్ల వృద్ధురాలిపై 34 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరికుంటపాడు ప్రధాన రహదారి వెంబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళలు తమ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..శక్తి యాప్ మహిళల నివాసం, కార్యాలయం, ప్రయాణంలో రక్షణ కల్పించేలా రూపొందించింది పడిందని, ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు భద్రత కొత్తదారులు తెరుచుకున్నాయని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలోని 6 మోడల్ స్కూల్స్లో 2025-26 విద్యా సంవత్సరంకు ఉచిత విద్యకై ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో, విద్యార్థుల ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. మే 22వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో పేర్కొన్నారు.
ప్రజా వినతుల పరిష్కార వేదికలో వివిధ వర్గాలు ఇచ్చే వినతులను పరిష్కరించిన అనంతరం తెలుగులో వారికి అర్ధమయ్యే రీతిలో సమాచారం ఇవ్వాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆయా డివిజన్ల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ప్రతి వినతిని పరిష్కరించిన తర్వాత ఆయా వినతులు అందించిన వారితో మాట్లాడి వారు ఇచ్చిన వినతులను పరిష్కరించాలన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ఇంజనీరింగ్, హౌసింగ్, టిడ్కో విభాగాల వారితో మీటింగ్ నిర్వహించారు. ఎల్&టి ఇంజనీరింగ్ కంపెనీ వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప్రతినిధులకు తెలిపారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 283 మంది మందుబాబులపై కేసులు నమోదు చేసారన్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలానాలను విధించారని తెలిపారు. ఇకనైనా పద్ధతులను మార్చుకొవాలన్నారు.
ప్రభుత్వ శాఖల నుంచి ఇద్దరు లేదా ముగ్గురుకి మార్చి 18 నుంచి 22 వరకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జడ్పీ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల నుంచి ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి సత్వరమే అందజేయాలన్నారు. కంప్యూటర్ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్స్, అడ్వాన్స్ టూల్స్పై శిక్షణ ఇస్తామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కలెక్టర్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జిదారులను కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రత్యేక సిబ్బందిని కలెక్టర్ నియమించారు.
మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఐసీడీఎస్, సీపీఓ, గనులు, జిల్లా పంచాయతీ తదితర శాఖల అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, ఎంపీ లాడ్స్, జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్, జడ్పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల భవనాల మరమ్మతులకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.