Andhra Pradesh

News March 23, 2024

సికింద్రాబాద్- సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైలు

image

హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- సంత్రాగచ్చి- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు. సికింద్రాబాద్- సంత్రాగచ్చి (07645) ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు దువ్వాడ చేరుకొని ఇక్కడి నుంచి 9.40కు బయలుదేరి వెళుతుందన్నారు.

News March 23, 2024

కృష్ణా: డీఎడ్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిధిలోని డీఎడ్ విద్యార్థులు (2022- 24 బ్యాచ్) రాయాల్సిన సెకండియర్ 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు దేవానందరెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.

News March 23, 2024

అనంత: అత్యాచారం కేసులో నిందుతుడికి పదేళ్ల జైలు

image

గార్లదిన్నెలో కూరగాయల మండీలో కూలీగా అస్సాం రాష్ట్రానికి చెందిన పప్పుబాగ్ (రాజు) పని చేసేవాడు. ఈక్రమంలో 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. 4నెలల గర్భవతిగా ఉండగా 2023 మే 26న బాలిక తల్లిదండ్రులు గార్లదిన్నె పోలీసుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో పదేళ్లు జైలు, రూ.3 వేలు పొక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు వెల్లడించింది

News March 23, 2024

ప్రకాశం జిల్లాలో YCP ఇప్పటివరకూ గెలవని స్థానాలు

image

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

News March 23, 2024

25న కుప్పంలో చంద్రబాబు భారీ బహిరంగ సభ

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 25న సోమవారం జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో పీఈఏస్ వైద్య కళాశాలకు ఆయన చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి అనంతరం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.

News March 23, 2024

కదలనున్న ‘వారాహి’.. పిఠాపురం నుంచే ఎందుకంటే..?

image

ఉమ్మడి తూ.గో జిల్లాపై TDP-జనసేన-BJP కూటమి ఫోకస్ పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ.. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లనుండటం కేడర్‌లో జోష్ నింపింది. శక్తిపీఠం కొలువై ఉండటం, శ్రీపాద వల్లభుడు జన్మించిన పవిత్ర భూమి కావడంతో పవన్ ‘వారాహి’ ఇక్కడి నుంచే ప్రచారంలో దిగనున్నట్లు తెలుస్తోంది. 3రోజులు అక్కడే ముఖ్య నేతలతో భేటి కానున్నారట. త్వరలో చంద్రబాబు, లోకేశ్ సైతం పర్యటన చేపట్టనున్నారు.

News March 23, 2024

విజయవాడ: సమాచార శాఖలో ఇకపై వారి సేవలకు సెలవు

image

రాష్ట్ర సమాచార శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ఉపసంహరించుకున్నట్లు ఆ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పెద్ద ఎత్తున తమ సానుభూతిపరులను సమాచార శాఖలోకి తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వీరందరినీ విధుల నుంచి తొలగిస్తూ సర్క్యులర్ మెమో నంబర్. 4539/అడ్మిన్-1-1/2019ను జారీ చేశారు.

News March 23, 2024

విశాఖ: పెళ్లి కారు బోల్తా పడిన ఘటనలో బాలుడి మృతి

image

ఇటీవల శొంట్యాంలో పెళ్లి కారు <<12894599>>బోల్తా పడిన విషయం<<>> తెలిసిందే ఈ ఘటనలో గాయాలైన ఓ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆనందపురం ఎస్సై శివ వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు చిన్నారులలో తీవ్రంగా గాయపడిన కౌశిక్ (4) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం బంధువులకు అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు పూర్తి సమాచారం కోసం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 23, 2024

NLR: ఒకే చోట 9వ సారి MLAగా పోటీ

image

కోవూరులో వరుస విజయాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1993లో తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్న తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 99 ఎన్నికల్లోనూ విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఆరంభం నుంచి ఒకే నియోజకవర్గంలో కొనసాగుతూ 9వ సారి పోటీ చేయబోతున్నారు.

News March 23, 2024

VZM: ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం ఇక్కడి నుంచే పోటీ చేశారు

image

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి 1953లో ప్రాతినిధ్యం వహించి చట్టసభలకు వెళ్లారు. 1953లో సీవీ సోమయాజులు అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎస్పీ నుంచి టంగుటూరి ఏకగ్రీవంగా ఎన్నికై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.

error: Content is protected !!