India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి ఉండాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రంలో చిల్డ్రన్స్ పార్క్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్, డివిజన్, మండల కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరిధిలోని సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.
ఏప్రిల్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒంటిమిట్ట ఆలయం, 4 మాడవీధులు, కళ్యాణ వేదిక, పార్కింగ్ ఇతర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రత చర్యలపై సమీక్షించారు.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ, ఎం.వి.పి.కాలనీలోని ఆయన స్వగృహంలో స్టార్ డైరక్టర్ అనిల్ రావిపూడి టీం ఆదివారం కలిశారు. ప్రస్తుత సినిమాలు గురించి, మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించనున్న కొత్త సినిమా గురించి కొంతసేపు మాట్లాడుకున్నారు. కొత్త చిత్రాన్ని తెరకెక్కించే ముందు, ఆ కథతో వచ్చి సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు సెంటిమెంట్ అని అన్నారు.
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆయన ALL THE BEST తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉ. 9.30 నుంచి మ. 12.45 వరకూ పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తాగునీరు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు DEO మాణిక్యం నాయుడు, రాష్ట్ర పరిశీలకుడిగా జిల్లాకు వచ్చిన విద్యాశాఖ అధికారి టెహరా సుల్తానా చెప్పారు. ఆదివారం విజయనగరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా సీసీ టీవి కెమెరాలను అమర్చామన్నారు. 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
నేడు జరగబోయే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలన్నారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
నరసాపురం సబ్ కలెక్టరేట్లో ఈనెల 17న తేదీన సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. సబ్ డివిజన్లోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా జరుగుతుందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను ఉదయం 10:30 గంటల నుంచి అందించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.