Andhra Pradesh

News March 21, 2024

పాతపట్నం నుంచి ఈ సారి గెలిచేదెవరు?

image

పాతపట్నం నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కలమట వెంకటరమణమూర్తి, రెడ్డిశాంతి వరసగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ వెంకటరమణ 2019 టీటీపీ నుంచి వైసీపీ అభ్యర్థి రెడ్డిశాంతిపై పోటీచేసి ఓడిపోయారు. కలమట వెంకటరమణ తండ్రి కలమట మోహనరావు టీడీపీ నుంచి నాలుగుసార్లు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి గెలిచారు. వైసీపీ నుంచి రెడ్డిశాంతికి టికెట్ కన్ఫామ్ అయ్యింది. పాతపట్నంలో ఈ సారి గెలిచేదెవరు.

News March 21, 2024

తాళ్లరేవు:ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో

image

216వ నంబర్‌ జాతీయ రహదారిపై తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్టు కోరంగి పోలీసులు తెలిపారు. యానాం నుంచి కాకినాడ వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు కాకినాడ ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.

News March 21, 2024

కర్నూలు : పది పరీక్షకు 589 మంది గైర్హాజరు

image

జిల్లాలో జరగుతున్న పదో తరగతి పరీక్షల్లో 588 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో శ్యాముల్ బుధవారం తెలిపారు. ఆంగ్ల పరీక్షకు మొత్తం 31,465 మందికి గాను 30,878 మంది విద్యార్థులు పరీక్ష రాసారని తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదన్నారు. అలాగే సార్వత్రిక విద్యలో పదో తరగతి పరీక్షకు 964 మందికి గాను 891 మంది పరీక్ష రాసినట్లు 73 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.

News March 21, 2024

పాతూరు మార్కెట్లో కూరగాయల ధరలు

image

అనంతపురం నగరంలోని పాతూరు మార్కెట్లో కూరగాయల ధరల వివరాలు… టమాటాలు (మేలు రకం) ₹20, రెండో రకం ₹10, మిరపకాయలు ₹50, ఉల్లిపాయలు (మేలు రకం) ₹25, రెండో రకం ₹15, ఆలుగడ్డలు ₹35, బీన్స్ ₹60, క్యారెట్ (మేలు రకం) ₹42, రెండో రకం ₹30, వంకాయలు ₹30, బెండకాయలు ₹40, ముల్లంగి ₹40, బీట్ రూట్ ₹40, బీరకాయలు ₹40, చౌళేకాయలు ₹40, కాకరకాయలు ₹40, క్యాబేజీ ₹40, మునక్కాయలు ₹60, నిమ్మకాయ (వంద) ₹350, అల్లం (కొత్తది) ₹140.

News March 21, 2024

ఉండి: ప్రేమ పేరిట వేధింపులు.. యువకుడిపై కేసు

image

ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించిన యువకుడిపై కేసు నమోదైందని ఉండి పోలీసులు తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక తాతయ్య వద్ద ఉంటోంది. యండగండి గ్రామానికి చెందిన చంటి ప్రేమ పేరిట వెంటపడి వేధిస్తుండేవాడని పోలీసులు తెలిపారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి పెళ్లికి ఒప్పుకోకపోతే చంపుతానని బెదిరించాడన్నారు.దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

News March 21, 2024

నేను అందరికీ అందుబాటులో ఉంటా: ప్రశాంతి

image

తాము ఎవరికీ అందుబాటులో ఉండమన్న అపోహ నాయకులు, కార్యకర్తల్లో ఉందని.. అలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. తాను ప్రతి నాయకుడు, కార్యకర్తకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నార్త్ రాజుపాలెంలో వేమిరెడ్డి దంపతుల పరిచయ కార్యక్రమం పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దినేశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పోలంరెడ్డి కుటుంబం తరహాలోనే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ప్రశాంతి చెప్పారు.

News March 21, 2024

VZM: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్

image

తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని యువకుడు ఆత్మహత్య చేసుకొన్న ఘటన సాలూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలగవలస గ్రామానికి చెందిన జన్ని రమేష్(21) తను ప్రేమించిన యువతి దక్కలేదని, పొలంలో పురుగుల మందు తాగి తన అన్నకు ఫోన్ చేసాడు. కొన ఊపిరితో ఉన్న రమేశ్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2024

ప్రొద్దుటూరు: వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు

image

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు అయింది. ప్రొద్దుటూరు 22వ వార్డు కౌన్సిలర్ వైఎస్ మహమ్మద్ గౌస్ ఇంటిలో బుధవారం వరదరాజుల రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సమావేశం నిర్వహించారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కౌన్సిలర్ వైఎస్ మహమూద్ గౌస్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డిపై కేసు నమోదు చేశారు.

News March 21, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కి షాక్

image

విశాఖ ఉక్కును విద్యుత్ బిల్లుల గండం మరింత భయపెడుతోంది. బాయిలర్ బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని 315 మెగావాట్ల సొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్‌ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ఈపీడీసీఎల్ హెచ్చరిస్తూ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.

News March 21, 2024

కర్నూలు: ఆ అభ్యర్థులకు పోటీ ప్రత్యర్థులతో కాదు.. అసమ్మతితో

image

కర్నూలు జిల్లాలో ఇరు పార్టీల అభ్యర్థులకు సంకట పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోరాడాల్సిన వారు తమ పార్టీకి చెందిన టికెట్ దక్కని అసమ్మతి నేతలతోనే పోటీ పడుతున్నారు. ఆలూరు వైసీపీ అభ్యర్థి విరుపాక్షి.. గుమ్మనూరు వర్గంతోను, మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర తిక్కారెడ్డి వర్గంతో, కోడుమూరు టీడీపీ అభ్యర్థి దస్తగిరి ఆకేపోగు ప్రభాకర్ వర్గంతోను పోటీ పడుతున్నారు.

error: Content is protected !!