India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 29న సీఎం జగన్ మేము సిద్ధం బస్సుయాత్ర ఎమ్మిగనూరులో నిర్వహించనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం కర్నూలులోని త్రిగుణ క్లార్క్ ఇన్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ పొన్నం రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. 29న ఎమ్మిగనూరులో భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు.
కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నరసన్నపేట మండలం కొత్త పోలవలస సర్పంచ్ వెంకట శ్యామ్కుమార్ బుధవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆయన భార్య ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇటీవల పలువురి నుంచి నగదు అప్పుగా తీసుకుని.. అది తీర్చలేక పోవడంతోనే మనస్తాపం చెంది వెళ్లిపోయారని తెలిపారు.
ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామ పరిధిలో మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్పై వేటు పడింది. ఆ వాలంటీర్ పై పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ మధులత ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
పార్వతీపురం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కుసుమగుడి వీధికి చెందిన కల్లూరి తారకేశ్వరరావు(20) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా అనే కారణంతో మనస్థాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయాడన్నారు. ఈ మేరకు పట్టణ ఎస్సై సంతోషి కుమారి వివరాలను నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
దొమ్మరనంద్యాల గ్రామంలోని 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు బుధవారం మైలవరం ఎంపీడీఓ శంషాద్ భాను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న జమ్మలమడుగు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు తీసుకోవడం, ర్యాలీలో వెళ్లడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని పేర్కొన్నారు. దీంతో వారిని తొలగించామన్నారు.
నంద్యాల జిల్లాలో జనావాసాల మధ్య దొరికిన నాలుగు పులి పిల్లలు ప్రస్తుతం తిరుపతి ఎస్వీ జూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు పులి పిల్లల్ని నల్లమల అభయారణ్యానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసి పులి పిల్లలకు వేటాడటం నేర్పించేందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ప్రయోగాత్మకంగా దీనిని చేపట్టారు.
భారతదేశంలోని 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజియన్ లో రాయచోటి, వీరబల్లి, జమ్మలమడుగులో (50, 51, 52 వ బ్రాంచీలు) 3 కొత్త బ్రాంచ్ కార్యాలయాలను NDGM-1 గోవింద్ ప్రసాద్ వర్మ ప్రారంభించారు. AGM & రీజినల్ హెడ్ P.అమరనాథ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ B.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. తమ సేవలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరిస్తామని తెలిపారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు ఇందిరా నగర్లో కాపురం ఉంటున్న వెంకటేశ్ స్థానికంగా ఉన్న శ్రీకళ(20)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను మదనపల్లికి తరలించారు.
రత్నం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు కేవీ రత్నం భౌతికకాయానికి నెల్లూరు హరనాథపురంలోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యారంగానికి రత్నం అందించిన సేవలను స్మరించుకున్నారు. వీరి వెంట రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి మల్లికార్జున సూచించారు. సిరిపురం చిల్డ్రన్ ఏరీనాలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులకు ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.