India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెర్లాం మండలం చిన్నయ్య పేటకు చెందిన గొర్రెలు, మేకల మందపై పిడుగు పడి పది మేకలు మృతి చెందాయి. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సుమారుగా 25గొర్రెలు మృతి చెందినట్లు తెలుస్తుంది. అధిక సంఖ్యలో మూగజీవాలు మృతి చెందటంతో గొర్రెల కాపరులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో పొలాల్లో ఉన్నవారు ఇండ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
2019లో వైసీపీకి ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీ తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగనున్నారు. 2019లో గుడివాడలో టీడీపీ తరపున బరిలో దిగి ఓడిన అవినాష్ వైసీపీలోకి చేరి తాజాగా విజయవాడ తూర్పు నుండి బరిలో దిగనున్నారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరి గన్నవరం నుంచి మరోసారి బరిలో నిలిచారు. వీరిని గెలుపు వరించేనా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాగం పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,470 కేంద్రాలను పరిశీలించామన్నారు. ఇందులో 420కు పైగా క్రిటికల్ సెంటర్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సీఎం శౌర్య పతకం మంగళవారం ఉన్నతాధికారులు ప్రకటించారు. వారిలో గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐగా పనిచేసిన కె.వాసును ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. ఇంటెలిజెన్స్లో ఉన్న ఎస్ఐ మధుసూదన్ రావు, ఆర్ఐ వెంకటరమణ, R SI సంపత్ రావు, కానిస్టేబుళ్లు త్రిమూర్తులు, భాస్కరరావులకు ముఖ్యమంత్రి శౌర్య పతకం వరించింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. YCPలో ఒంగోలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులకు స్థాన చలనం కల్పించారు. TDP మాత్రం దాదాపు పాత నాయకులనే బరిలోకి దింపుతోంది. దర్శి, చీరాల అభ్యర్థులను కూటమి ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడ కూడా దాదాపు లోకల్ వాళ్ల బరిలో ఉండే అవకాశం ఉంది. రెండు పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ కమ్ జిల్లా ఎన్నికల అధికారిణి డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 9మంది వాలంటీర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన ఏడుగురు, కర్నూలుకు చెందిన ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. ఈ మేరకు సంబంధిత వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఎన్నికల కోడ్ వచ్చినా జిల్లాలో కొన్ని స్థానాలపై ఉత్కంఠ వీడలేదు. YCP అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి 6 స్థానాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కోడూరు స్థానాలను ప్రకటించలేదు. జమ్మలమడుగు, బద్వేలు స్థానాలు పొత్తులో భాగంగా BJPకి.. రాజంపేట, కోడూరులో ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక కడప MPకి ముగ్గురు పోటీలో ఉన్నారు.
గతేడాది ఆగస్టులో అలిపిరి వద్ద చిరుత దాడిలో నెల్లూరు జిల్లా కోవూరు(M) పోతిరెడ్డిపాలేనికి చెందిన లక్షిత చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్రెడ్డి చెప్పారు.
గతేడాది ఆగస్టులో అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్రెడ్డి చెప్పారు.
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.