India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

రామలింగేశ్వర నగర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు పటమట ఎస్సై శాతకర్ణి తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. మృతుడి వయసు సుమారు 50సం. వరకు ఉంటుందని చెప్పారు. మృతిని ఆచూకీ తెలిసిన ఎడల పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

జులై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీకి జిల్లాలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించేందుకు గాను కలెక్టరేట్తో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 2.42లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

మహాత్మాజ్యోతిబాఫులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6 నుంచి 9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు జిల్లా కన్వీనర్ తెలిపారు. mjpabcwriers.apcfss.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకుని, ర్యాంకు కార్డు పొందవచ్చని చెప్పారు. ప్రతిభ జాబితా ప్రకారం ఖాళీలను అనుసరించి కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ హయాంలో విశాఖ నగరంలో నిర్మించిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. వాటి పునరుద్ధరణకు రూ.3.2 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఇంజినీరింగ్ అధికారులు త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఆరేళ్ల క్రితం నగరంలో 25 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.40 లక్షలు వెచ్చించింది.

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రదేశం ఉదయగిరి. చారిత్రిక సంపదతో పాటు ప్రకృతి అందాలకు నెలవు. రాయలవారు దేశాన్ని జయించినా ఉదయగిరి వైపు అడుగులు కూడా వేయలేకపోయారు. చివరకు సంధి మార్గం ద్వారా ఉదయగిరి కోటను జయించారు. ఇక్కడ ఎన్నో ఆలయాలు నిర్మించారు. అప్పట్లో ప్రతి ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో కళకళలాడేది. నేడు ఉదయగిరిలోని ఆనాటి దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఆదోని పట్టణంలోని స్థానిక రాయనగర్ సమీపాన గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని గుర్తించి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ వద్దకు కొద్దిసేపటి కింద అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ డ్యాములను నిపుణులు పరిశీలించారు. 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించి పూర్తిగా అధ్యయనం చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, స్కూల్స్ మూసివేతను ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.