India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మరో 48 గంటల్లో ఈవీఎంలపై బటన్ నొక్కేందుకు ఓటరు సిద్ధమవుతుండగా..వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బూత్ల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి రూ.1000 నుంచి 1500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్ పేమెంట్ చెయ్యగా.. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. పట్టణాల్లో టోకెన్ సిస్టం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండంతో అధికారులు నిఘా పెంచారు.
ఎన్నికల విధుల్లో పాల్గొని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. దీనికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కు విశాఖలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో అనూహ్య స్పందన లభించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 6,651 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోగా 2024లో జరుగుతున్న ఎన్నికలకు ఏకంగా 15,993 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు.
జాతీయ రహదారిపై మనుబోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లకూరు మండలం చిల్లకూరుకు చెందిన వేణు, ఆకాష్ బైక్ పై నెల్లూరు నుంచి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. వేణు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆకాష్ నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరికొన్ని గంటల్లో గుంటూరు జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. గుంటూరులో, నరసరావుపేటలో ఓటుకు రూ.2 వేలు, మాచర్లలో రూ.3 వేలు ఒకరు.. రూ.2 వేలు మరొకరు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓ చోట ఏకంగా రూ.5వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. 2వసారి పంపిణీకీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ప్రభుత్వ, 16 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు అనంతరం సమీపంలోని ఎన్ఆర్పీ అగ్రహారం, ఆచంటలోని ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకొని రసీదు పొందాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా నేటి సాయంత్రం 6 గంటలకు తమ ప్రచారాన్ని ముగించాలి. ఓటింగ్ జరగడానికి 48 గంటలు ముందుగా అభ్యర్థులు తమ ప్రచారాలను ముగించాలి. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులు ఎటువంటి ప్రచారాలు సభలు నిర్వహించకూడదు. రేపు, ఎల్లుండి పత్రికల్లో ఇచ్చే ప్రకటనలపై కూడా ఎన్నికల సంఘం అనుమతితో మాత్రమే ప్రచురించాల్సిన అవసరం ఉందని జిల్లా అధికారులు సూచించారు.
మరికొన్ని గంటల్లో కృష్ణా జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. విజయవాడ తూర్పులో ఓటుకు రూ.1,500, సెంట్రల్లో రూ.2వేలు, నందిగామ, జగ్గయ్యపేటల్లో పరిస్థితిని బట్టి రూ.1500 నుంచి రూ.2వేలు, గుడివాడ, పెనమలూరులో రూ.2వేలు పంచుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. రెండోసారి పంపిణీకి సిద్ధమవుతున్నారు.
అనంతలో పోలింగ్ నిర్వహణకు 15,776 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులు (పీఓ) 2,472 మంది, సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ) 2,552 మందిని నియమించారు. ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓ) 10,208 మందిని వినియోగించనున్నారు. వీరు కాకుండా 544 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 1,032 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు.
యద్దనపూడి మండలం పూనూరు గ్రామంలో విషాద ఘటన చేటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ మేరి (28) పోతురాజు దంపతులు పరదాల వ్యాపారం నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఎన్నికల్లో స్వగ్రామంలో ఓటేసేందుకు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై పూనూరుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే కామారెడ్డి వద్ద ప్రమాదానికి గురై, మేరి మృతి చెందినట్లు సమాచారం అందిందని బంధువులు వెల్లడించారు.
కొద్ది రోజులుగా అందరి ఓట్లు అభ్యర్థిస్తున్న అభ్యర్థుల్లో కొందరు తమ ఓటు తమకు వేసుకోలేరు. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారికి ఓటు లేకపోవడమే కారణం. కోవూరులో హోరాహోరీగా తలపడుతున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కోటలో, వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు రూరల్లో ఓటు ఉంది. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి నెల్లూరు రూరల్లో, ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటు ఆత్మకూరులో ఉంది.
Sorry, no posts matched your criteria.