India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్- 3 పోటీల్లో పాల్గొనే ఫ్రాంచైజీ జట్లకు సంబంధించిన ఎంపికలకు క్రీడాకారుల నుంచి చక్కటి స్పందన లభించింది. ఈ ఎంపికలకు కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన 140 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఏసీఏ సౌత్ జోన్ కార్యదర్శి రెడ్డిప్రసాద్ తెలిపారు.
అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం ఎన్నికల సెక్టోరియల్, పోలీస్ అధికారులు, అసెంబ్లీ స్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పారదర్శకంగా పని చేయాలని కోరారు. పోలింగ్ సిబ్బంది నిబంధనలకు లోబడి పని చేయాలని అన్నారు.
ఓటు శక్తివంతమైన ఆయుధమని, ఓటు ద్వారా మన తలరాతను మార్చవచ్చని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. చీరాల మండలం జాండ్రపేట హైస్కూల్ వద్ద నుంచి గడియార స్తంభం వరకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో 2కే రన్ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య, చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య తనయుడు గౌరీ అమర్నాథ్ తో కలిసి హీరో నిఖిల్ పాల్గొంటున్నారు.
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమవెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. – మన ప.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?
శ్రీకాకుళం జిల్లాలోని మే 13 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పాల్గొననున్న ఎక్స్ సర్వీస్ మెన్, NCC, NSS వాలంటీర్లు పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధి విధానాలపై.. శుక్రవారం ఎస్పీ జీ.ఆర్ రాధిక ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో గల వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, NCC కో-ఆర్డినేటర్స్, NSS, ప్రతినిదులు ఎక్స్ సర్వీస్ మెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.
– మన తూ.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?
ఎన్నికల ప్రచారాలు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారాలు, ర్యాలీలు, సభల నిర్వహణ, విందులు ఏర్పాటు, లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధమని ఆయన స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ కేవీ మురళీకృష్ణలతో కలిసి పోలీసు అధికారులతో శాంతిభద్రతల నిర్వహణపై చేపడుతున్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి డిఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు.
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, వీఆర్వోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.